అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై అదనంగా 25 శాతం సుంకాలు (Tariffs) విధిస్తానని ప్రకటించారు. ఇప్పటికే అమెరికా భారత దిగుమతులపై 25% టారిఫ్ అమలు చేస్తోంది. ట్రంప్ తాజా ప్రకటన మేరకు ఇది 50 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) తీవ్రంగా స్పందించారు. ట్రంప్ విధించే ఈ అధిక సుంకాలకు భారత ప్రభుత్వం తగిన బదులు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. “అంతర్జాతీయ వాణిజ్యంలో పరస్పర గౌరవంతో వ్యవహరించాలి. ఒప్పందాలను ఒకపక్షంగా ఉల్లంఘించడమైతే మంచిది కాదు. భారత్ కూడా తన హక్కులను రక్షించుకోవాలి,” అని శశిథరూర్ (Shashi Tharoor) వ్యాఖ్యానించారు.

‘ట్రంప్ టారిఫ్లపై ముందుగా మనం ఆ దేశంతో చర్చించాలి. మనపై ట్రంప్ ఎంత కోపంగా ఉన్నాడో నాకైతే తెలియదు. చైనాపై టారిఫ్లు విధించినప్పుడు వారికి 90 రోజుల గడువు ఇచ్చారు. మనకు మాత్రం కేవలం 21 రోజులే ఇచ్చారు. 21 రోజుల్లో చర్చలు ఫలించకపోతే మన వస్తువులపై అమెరికాలో 50 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. అదేగనుక జరిగితే మనం ప్రతీకార టారిఫ్లు విధించడమే ఉత్తమం’ అని శశిథరూర్ (Shashi Tharoor)వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా దిగుమతులపై భారత్ 17 శాతం టారిఫ్లను మాత్రమే అమలు చేస్తోందని, దాన్ని కూడా 50 శాతానికి పెంచాలని థరూర్ సూచించారు. వాళ్లు మనపై సుంకాలు వేస్తే మనం వాళ్లపై కూడా వేయాలని అన్నారు.
శశి థరూర్ స్పెషాలిటీ?
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ వ్యవస్థాపక-ఛైర్మన్, ఆయన గతంలో కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా పనిచేశారు. ఆయనకు దాదాపు రెండు డజన్ల బిరుదులు ఉన్నాయి మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరం “గ్లోబల్ లీడర్ ఆఫ్ టుమారో”గా అవార్డును ప్రదానం చేసింది.
శశి థరూర్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
శశి థరూర్ తన అసాధారణ భాషా సామర్ధ్యాలకు ప్రసిద్ధి చెందారు. ఆయన ఎన్ని భాషలు అనర్గళంగా మాట్లాడగలరో స్పష్టంగా చెప్పనప్పటికీ, ఆయన ఇంగ్లీష్, హిందీ మరియు మలయాళంలో నిష్ణాతులుగా ఉంటారు. ఆయన ఫ్రెంచ్ కూడా మాట్లాడతారు, ఫ్రాంకోఫోన్ ఆఫ్రికన్ దేశాలతో దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన దీనిని సమర్థవంతంగా ఉపయోగించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Justice Yashwant: యశ్వంత్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు