हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Shashi Tharoor: ఉగ్రవాదంపై మోదీ చర్యలను ప్రశంసించిన శశిథరూర్ మండిపడ్డ.. కాంగ్రెస్ నేతలు

Ramya
Shashi Tharoor: ఉగ్రవాదంపై మోదీ చర్యలను ప్రశంసించిన శశిథరూర్ మండిపడ్డ.. కాంగ్రెస్ నేతలు

శశిథరూర్ ప్రశంసలు – కాంగ్రెస్‌లో మరోసారి తీవ్ర విమర్శలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ మరోసారి తన పార్టీ నాయకుల నుండి తీవ్ర విమర్శలకు గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉగ్రవాదంపై చేపట్టిన చర్యలను ఆయన ప్రశంసించడంతో ఈ వివాదం మొదలైంది. తాజాగా పహల్గామ్‌ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై ప్రపంచస్థాయిలో జరుగుతున్న ప్రచార కార్యక్రమానికి శశిథరూర్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ ప్రచార మిషన్‌లో భాగంగా అమెరికా, పనామా పర్యటనల అనంతరం శశిథరూర్ నాయకత్వంలోని భారత ప్రతినిధి బృందం ప్రస్తుతం కొలంబియాలోని బొగోటా (Bogota, Colombia) నగరానికి బయలుదేరింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో భిన్న స్పందనలకు దారి తీశాయి.

Shashi Tharoor: ఉగ్రవాదంపై మోదీ చర్యలను ప్రశంసించిన శశిథరూర్ మండిపడ్డ కాంగ్రెస్ నేతలు
Shashi Tharoor

ఉగ్రవాదంపై ప్రతీకార చర్యలు — శశిథరూర్‌ వ్యాఖ్యలు

బుధవారం పనామా నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో శశిథరూర్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులకు తాము తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే విషయం అర్థమైందని అన్నారు. “యూరీ దాడుల అనంతరం తొలిసారిగా నియంత్రణ రేఖ దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. పుల్వామా దాడి తర్వాత నియంత్రణ రేఖనే కాకుండా అంతర్జాతీయ సరిహద్దును కూడా దాటి బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాం. ఈసారి అంతకు మించి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాం” అని శశిథరూర్ వివరించారు.

కాంగ్రెస్ నేతల నుండి మండిపాటు

థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఉదిత్ రాజ్ మాట్లాడుతూ, శశిథరూర్ బీజేపీకి సూపర్ ప్రతినిధిగా మారి, మోదీ భజన చేస్తున్నారని ఆరోపించారు. పవన్ ఖేరా, జైరాం రమేశ్ కూడా థరూర్‌ను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. యూపీఏ హయాంలోనూ అనేక సర్జికల్ దాడులు జరిగాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన వీడియోను ఖేరా ట్యాగ్ చేశారు.

ట్రోల్స్‌కు తగిన సమాధానం – థరూర్ స్పందన

తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌ గురించి శశిథరూర్‌ గురువారం స్పందించారు. ఎక్స్ (మాజీ ట్విటర్) వేదికగా, “పనామాలో కార్యక్రమాలు ముగించుకుని, ఆరు గంటల్లో బొగోటా (Bogota) కు బయలుదేరాల్సిన పరిస్థితిలో ఉన్నా, కొందరు నాపై నిందలు వేస్తున్నారు. నేను చేసిన వ్యాఖ్యలు ఉగ్రవాద దాడులపై ప్రతీకార చర్యల గురించి మాత్రమే. గత యుద్ధాల గురించి మాట్లాడలేదు. నా మాటలను వక్రీకరిస్తూ ట్రోల్‌ చేసే వారిని పట్టించుకోను. నా వ్యాఖ్యలను వక్రీకరించేవారికి, ట్రోల్ చేసేవారికి ఇదే నా సమాధానం. నాకు ఇంతకంటే ముఖ్యమైన పనులున్నాయి” అని

పార్టీ అంతర్గత కలహాల సంకేతమా?

థరూర్‌పై కాంగ్రెస్ నేతల విమర్శలు ఈ పార్టీకి ఉన్న అంతర్గత విభేదాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాల్లోనూ ఒకే పార్టీకి చెందిన నేతలు విభిన్న దృక్కోణాలను కలిగి ఉండడం, కాంగ్రెస్‌లో అవగాహన లోపం ఉన్నదనే ఆరోపణలకు బలాన్ని ఇస్తోంది. శశిథరూర్ వంటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన నేత తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించగలడా లేదా అన్నదానిపై కూడా చర్చ మొదలైంది. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించినందుకే థరూర్ విమర్శలకు గురయ్యారా? లేక పార్టీ అంతర్గత రాజకీయాల్లో ఒక భాగమా? అన్న అనుమానాలు రాజకీయ పరిశీలకుల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read also: Rahul Gandhi: గిగ్ కార్మికులకు సామాజిక భద్రతపై రాహుల్ హామీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870