నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఆందోళన నెలకొంది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడటంతో ఆయనను ఈరోజు మధ్యాహ్నం పుణేలోని ప్రసిద్ధ రుబీహాల్ క్లినిక్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన వెంటనే వైద్యులు ఆయనకు అత్యవసర పరీక్షలు నిర్వహించి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. వయస్సు రీత్యా తలెత్తిన శ్వాసకోశ సమస్యల కారణంగానే ఆయన ఇబ్బంది పడినట్లు ప్రాథమిక సమాచారం.
Ponnam Prabhakar: పట్టణం చుట్టూ రింగు రోడ్డుతో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇన్ఫెక్షన్ తగ్గడానికి వైద్యులు ఐదు రోజుల పాటు యాంటీబయాటిక్స్ కోర్సును సూచించినట్లు ఆమె వెల్లడించారు. తండ్రి ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. పవార్ను పరామర్శించడానికి పలువురు రాజకీయ ప్రముఖులు ఆసుపత్రికి తరలివస్తుండటంతో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఇటీవల పవార్ కుటుంబంలో జరిగిన విషాదం శరద్ పవార్ను మానసికంగా కృంగదీసిందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. శరద్ పవార్ సోదరుడి కుమారుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి కోలుకోకముందే పెద్దాయన అనారోగ్యం పాలవ్వడం కుటుంబ సభ్యులను, పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. 85 ఏళ్ల వయస్సులోనూ నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే పవార్, ఈ సంక్షోభం నుంచి కూడా క్షేమంగా బయటపడతారని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com