ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న సమయంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. “70 ఏళ్లుగా కాంగ్రెస్ (Congress) ఈవీఎంలను హ్యాక్ చేస్తోంది. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు మేము చేస్తే తప్పా?” అనే తర్జన-భర్జనతో చేసిన వ్యాఖ్యలు విస్తృతంగా స్పందనకు కారణమయ్యాయి.

వివాదాస్పద ఇంటర్వ్యూ
ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేఖరి ఆమెను ప్రశ్నించాడు – “రాహుల్ గాంధీ మిమ్మల్ని ఈవీఎంల హ్యాకింగ్(EVM hacking)లో ఆరోపిస్తున్నారు కదా?” అన్న ప్రశ్నకు స్పందిస్తూ, రేఖా గుప్తా కోపంగా – “కాంగ్రెస్ గెలిస్తే ప్రజా తీర్పు, మేము గెలిస్తే హ్యాకింగ్ అనుకుంటారా?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“ఈ ద్వంద్వ ధోరణి ఏ పుస్తకంలో ఉంది?” – రేఖా ప్రశ్న
ఈ సందర్భంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ, “ఈ డబుల్ స్టాండర్డ్కు వ్యాఖ్యం ఇవ్వగలవా? దేశ ప్రజలను గందరగోళపర్చడమే మీకు తెలుసు” అంటూ రేఖా గుప్తా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కేజ్రీవాల్ షేర్ చేసిన వీడియో వైరల్
ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన 13 సెకన్ల క్లిప్ను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. “ఢిల్లీ సీఎం ఏం చెబుతున్నారో వినండి” అంటూ ట్వీట్ చేయడంతో ఆ క్లిప్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. అయితే, ఆ వీడియో కత్తిరించబడినదని, అసలు ఇంటర్వ్యూలో సుదీర్ఘంగా జరిగిన సంభాషణను కాస్త వక్రీకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్లు అసలు 1.5 నిమిషాల వీడియోను బయటపెట్టగా, అందులోనూ రేఖా గుప్తా అదే వ్యాఖ్య చేసినట్లు కనిపించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: