Bhiwadi chemical factory : రాజస్థాన్లోని భివాడి ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని విషాదం నెలకొంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, కొద్ది సేపటికే పేలుళ్లు సంభవించడంతో పరిస్థితి మరింత విషమించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని సహాయక చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా పరిసర ప్రాంతాల ప్రజలను ముందస్తుగా ఖాళీ చేయించారు.
Read also: Government Jobs India: ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు

జిల్లా అదనపు మెజిస్ట్రేట్ సుమిత్రా పారీక్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఫ్యాక్టరీ అధికారికంగా వస్త్రాల కర్మాగారంగా నమోదై ఉన్నప్పటికీ, అక్రమంగా బాణాసంచా తయారీ జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పేలుళ్లకు అదే కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందడంపై ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మరియు ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: