Rahul Gandhi: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, దేశ ఇంధన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది ఇది ప్రారంభం మాత్రమే అని అన్నారు. ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే మేల్కొని, తగిన ఏర్పాట్లు చేయాలని గురువారం డిమాండ్ చేశారు. పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడిన రాహుల్ గాంధీ, దేశంలో నెలకొన్న గ్యాస్, ఎల్పీజీ పరిస్థితిపై సభలో మాట్లాడేందుకు తాను ప్రయత్నించగా, తనకు అనుమతి లభించలేదని తెలిపారు. “సాధారణంగా సభలో మాట్లాడటానికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్త విధానం మొదలైనట్లుంది. నేను మాట్లాడాలనుకున్న అంశంపై ముందు మంత్రి నిర్ణయిస్తారు, ఆ తర్వాతే నేను మాట్లాడాలి. మళ్ళీ ఆ తర్వాత మంత్రి స్పందిస్తారు. ఈ కొత్త పద్ధతి ఆశ్చర్యంగా ఉంది” అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Delhi Liquor Case: సత్యం నా తోడుగా ఉంది.. విచారణకు సహకరిస్తా: కవిత

“రాబోయే రోజుల్లో గ్యాస్, పెట్రోల్, అన్ని రకాల ఇంధనాలు పెద్ద సమస్యగా మారనున్నాయి. ఎందుకంటే మన ఇంధన భద్రత దెబ్బతింది. ప్రభుత్వ లోపభూయిష్ట విదేశాంగ విధానం ఈ సమస్యను సృష్టించింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రధాని మోదీ (Prime Minister Modi) మేల్కొని సన్నాహాలు ప్రారంభించాలి. లేకపోతే కోట్లాది మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతారు” అని స్పష్టం చేశారు. ఈ సమస్య కేవలం ఇరాన్ వంటి దేశాలు ఇంధన సరఫరాను అనుమతిస్తాయా లేదా అనేదాని కంటే చాలా పెద్దదని రాహుల్ అన్నారు. తాను చేస్తున్నది రాజకీయ విమర్శ కాదని, రాబోయే పెను ప్రమాదం గురించి కేవలం హెచ్చరిస్తున్నానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. “ఇది రాజకీయ ప్రకటన కాదు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: