हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Kharge : మల్లికార్జున ఖర్గే నోటి నుంచి పుష్ప డైలాగ్

Sudheer
Kharge : మల్లికార్జున ఖర్గే నోటి నుంచి పుష్ప డైలాగ్

పుష్పలోని “తగ్గేదేలే” డైలాగ్ ఇప్పటికీ ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. అయితే, ఈ డైలాగ్‌ను ఏకంగా రాజ్యసభ వేదికగా వినిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈ డైలాగ్‌ను ఉపయోగించి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అనురాగ్ ఠాకూర్ ఆరోపణలు – ఖర్గే ప్రతిస్పందన

బుధవారం లోక్‌సభలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను దుర్వినియోగం చేశారని, భూములను అనుమతి లేకుండా కబ్జా చేశారంటూ మల్లికార్జున ఖర్గేపై ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహాన్ని రేపాయి. ఖర్గే తనపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా మండిపడుతూ, తాను ఎవరికి భయపడనని, “తగ్గేదేలే” అంటూ కౌంటర్ ఇచ్చారు.

kharge
kharge

ఖర్గే భవోద్వేగ ప్రసంగం – అసత్య ఆరోపణలపై ఆగ్రహం

గురువారం రాజ్యసభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన ఖర్గే, అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణలను ఖండించారు. తనపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని, ఇటువంటి ఆరోపణలతో తన రాజకీయ జీవితానికి మచ్చ వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను పారదర్శకమైన రాజకీయాలు నిర్వహిస్తున్నానని, తనపై వచ్చే ఆరోపణలను నిరూపించగలరా? అని ప్రశ్నించారు. ఒకవేళ అవి నిజమైతే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పుష్ప డైలాగ్‌తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

ఖర్గే ప్రసంగంలో పుష్ప సినిమా డైలాగ్ వినిపించడం కాంగ్రెస్ సహా ఇండియా కూటమికి ప్రేరణ కలిగించింది. “తగ్గేదేలే” అని చెప్పిన తర్వాత కాంగ్రెస్ ఎంపీలు హర్షధ్వానాలు చేశారు. ఇది ఖర్గే రాజకీయ కఠినతను చూపించే సూచిగా మారింది. ఈ సంఘటన బీజేపీ – కాంగ్రెస్ మధ్య రాజ్యసభలో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా విపక్ష పార్టీల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870