Punjab lottery news : పంజాబ్లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి కేవలం రూ.50 పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేయగా అతనికి రూ.30 లక్షల బహుమతి తగిలింది. అయితే ఆ లాటరీ టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఇప్పటికీ తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
బర్నాలాలో వెలుగులోకి వచ్చిన ఘటన
ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని బర్నాలా జిల్లాలో జరిగింది. బర్నాలా రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక ఏజెంట్ వద్ద కొనుగోలు చేసిన లాటరీ టికెట్కు ఈ బహుమతి తగిలింది.
Read Also: Kamal Haasan-Trump: ట్రంప్కు కమల్ హాసన్ కౌంటర్

టిక్కెట్పై వివరాలు లేకపోవడం సమస్య
అయితే ఆ టిక్కెట్పై కొనుగోలు చేసిన వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేయలేదు. దీంతో విజేత ఎవరో గుర్తించడం నిర్వాహకులకు కష్టంగా మారింది.
గల్లీ గల్లీ తిరుగుతూ చాటింపు
విజేతను కనుగొనేందుకు లాటరీ ఏజెంట్ ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నాడు. మైకులు, డప్పులతో గల్లీ గల్లీ తిరుగుతూ చాటింపు వేయిస్తున్నాడు. లాటరీ తగిలిన వ్యక్తి వచ్చి ప్రైజ్ మనీ తీసుకెళ్లాలని పిలుపునిస్తున్నారు.
నెలలోపు తీసుకోకపోతే డబ్బు ప్రభుత్వానికి
లాటరీ నియమాల ప్రకారం విజేత నెల రోజుల్లోగా బహుమతి తీసుకోకపోతే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళుతుంది. అందుకే నిర్వాహకులు విజేతను వెతికే ప్రయత్నాలను వేగవంతం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: