PM modi foreign trips : ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. 2015 నుంచి 2025 వరకు గత పదేళ్లలో ఆయన చేసిన విదేశీ పర్యటనలపై మొత్తం ₹762.47 కోట్లు ఖర్చైనట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇంత విస్తృతంగా విదేశీ పర్యటనలు చేసిన ప్రధానిగా మోదీ నిలిచారని కూడా పేర్కొంది.
ఏడాది వారీ ఖర్చులు
2015లో విదేశీ పర్యటనల ఖర్చు ₹91.5 కోట్లు కాగా, 2024 నాటికి అది ₹109 కోట్లను దాటింది. అత్యధికంగా 2025లో ₹175.19 కోట్లు ఖర్చయ్యాయి. ఆ సంవత్సరంలో యూరప్, అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు విస్తృత పర్యటనలు చేయడం వల్ల ఖర్చులు పెరిగినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020లో ఎలాంటి విదేశీ పర్యటనలు జరగలేదు.
విదేశాంగ శాఖ వివరణ ప్రకారం, ప్రధాని పర్యటనల్లో వసతి, భోజనం వంటి ఆతిథ్య ఖర్చులను ఆతిథ్య దేశమే భరిస్తుంది. భారత ప్రభుత్వం భద్రత, అధికార ప్రతినిధుల బృందం, మీడియా, సాంకేతిక ఏర్పాట్ల కోసం మాత్రమే వ్యయం చేస్తుంది. సాధారణంగా ప్రధాని వెంట 27 నుంచి 72 మంది వెళ్తారు. అయితే గత ఏడాది ఐదు దేశాల పర్యటన సందర్భంగా ఈ సంఖ్య 95కి చేరింది.
Read Also: Winter Olympics: ఒలింపిక్స్ లో కండోమ్స్ కొరత

ప్రస్తుత ఖర్చులు పెరగడానికి ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోవడం, పర్యటించిన దేశాల సంఖ్య, ప్రయాణ దూరం పెరగడం వంటి అంశాలు కారణమని ప్రభుత్వం పేర్కొంది.
సంవత్సరాల వారీ ఖర్చులు (రూ. కోట్లలో)
2015 – 91.5
2016 – 33.22
2017 – 44.27
2018 – 51.46
2019 – 7.76
2020 – (కోవిడ్ కారణంగా పర్యటనలు లేవు)
2021 – 36.11
2022 – 55.82
2023 – 93.63
2024 – 109.51
2025 – 175.19
మొత్తం ఖర్చు: ₹762.47 కోట్లు
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: