పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ముఖాముఖి నిర్వహించారు. పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్ రెండో ఎపిసోడ్లో సోమవారం విద్యార్థులతో మాట్లాడుతూ, వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పలు సూచనలు చేశారు. పరీక్షల ఒత్తిడి నుంచి విద్యార్థులను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మోదీ తెలిపారు. పరీక్షల తర్వాత ఐదు వెకేషన్ స్థలాలు సూచించాలని రాయ్పుర్ విద్యార్థి కోరారు. రైలులో వెళ్లడం వల్ల వివిధ వర్గాలను కలవడం మంచి అనుభూతి అని మోదీ అన్నారు.
Read Also: PM Modi: విద్యార్థులతో ముఖాముఖి – పరీక్షలపై కీలక సూచనలు

డిజిటల్ టెక్నాలజీని మంచి దారిలో ఉపయోగించుకోవాలి
సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించాలని సూచించారు. టీవీలు, మొబైళ్లకు బానిసలు కావొద్దని సూచించారు. ఏఐ (AI) గురించి భయపడాల్సిన అవసరం లేదని, కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి చర్చలే జరిగాయని అన్నారు. చాలా మంది పిల్లలు మొబైల్కు బానిసలవుతున్నారని, ఫోన్ లేకపోతే తినడం కూడా మానేస్తున్నారని విన్నానని, ఈ పద్ధతి మారాలని, డిజిటల్ టెక్నాలజీని మంచి దారిలో ఉపయోగించుకోవాలని, దాని ద్వారా సామర్థ్యాన్ని పెంచుకోవాలని విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దిశానిర్దేశం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: