हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Bihar :వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్‌ పెంపు : సీఎం నితీష్ కుమార్

Sudha
Bihar :వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్‌ పెంపు : సీఎం నితీష్ కుమార్

బీహార్ (Bihar)ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar)ఇటీవల చేసిన కీలక ప్రకటనలో, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు అందుతున్న నెలవారీ పెన్షన్‌ (Pension)ను రూ.400 నుంచి రూ.1100కు పెంచుతున్నట్టు వెల్లడించారు. ఇది బీహార్ సంక్షేమ రంగంలో పెద్ద సంస్కరణగా భావించబడుతోంది.

Bihar  :వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్‌ పెంపు : సీఎం నితీష్ కుమార్
Bihar :వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్‌ పెంపు : సీఎం నితీష్ కుమార్


వృద్ధులు సమాజంలో ఒక విలువైన భాగం
సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద నెలవారీ ఇస్తున్న పెన్షన్‌ను భారీగా పెంచారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇప్పటి వరకు నెలకు రూ.400 ఇస్తుండగా.. ఇక నుంచి నెలకు రూ.1,100 ఇస్తామన్నారు. దీంతో ఏకంగా రూ.700 పెంచినట్లు అయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ.. “సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువు మహిళలందరికీ ఇప్పుడు ప్రతి నెలా రూ. 400కి బదులుగా రూ. 1,100 పెన్షన్ లభిస్తుందని మీకు తెలియజేయడానికి నేను సంతోషంగా ఉన్నాను. జూలై నెల నుండి పెరిగిన పెన్షన్‌ లబ్ధిదారులందరికీ లభిస్తుంది” అని అన్నారు.
వచ్చే నెల నుండి ప్రతి నెల 10వ తేదీ నాటికి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసేలా ప్రభుత్వం చూస్తుందని బీహార్ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సవరించిన పెన్షన్ పథకం బీహార్ అంతటా 1 కోటి 9 లక్షల 69 వేల 255 మందికి ప్రయోజనం చేకూరనుంది. సీనియర్ సిటిజన్లు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం నిబద్ధతను నొక్కి చెబుతూ, నితీష్ కుమార్, “వృద్ధులు సమాజంలో ఒక విలువైన భాగం, వారి గౌరవప్రదమైన జీవితాన్ని నిర్ధారించడం మా ప్రధానం. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశలో ప్రయత్నాలను కొనసాగిస్తుంది” అని అన్నారు.
లబ్ధి పొందే వారి సంఖ్య ..
ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ చర్య తీసుకోవడం గమనార్హం. జనతాదళ్ (యునైటెడ్), దాని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) భాగస్వాములు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిని ఎదుర్కొంటున్నందున తమ పట్టును బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఆర్థిక భద్రత
ఈ పెన్షన్ పెంపు వల్ల లబ్ధి పొందే వారి సంఖ్య సుమారు 2 కోట్ల మందిగా అంచనా వేయబడుతోంది. వీరిలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ముఖ్యంగా ఉంటారు. ఇది రాష్ట్రంలో నివసించే ఆర్ధికంగా బలహీనవర్గాలకు కొంత ఆర్థిక భద్రతను కల్పించనుంది.ఈ పెన్షన్ పెంపు కారణంగా రాష్ట్ర ఖజానాపై అదనంగా భారంగా పడే అవకాశం ఉన్నా, బీహార్ ప్రభుత్వం ఇది సామాజిక సంక్షేమానికి పెట్టే పెట్టుబడిగా భావిస్తోంది. ఫండింగ్ కోసం రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేసినట్టు సమాచారం.సామాజిక శాస్త్ర నిపుణులు, వృద్ధులు కోసం పెన్షన్ పెంపు చాలా అవసరమైన చర్య అని అభిప్రాయపడుతున్నారు. ఇది గ్రామీణ పేదల జీవన నాణ్యతను పెంపొందించడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు.

Read Also:Narendra Modi: విశాఖ యోగా వేడుకలపై మోదీ ప్రశంసలు, లోకేశ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870