हिन्दी | Epaper

OTT :18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన పార్లమెంటరీ ప్యానెల్

Anusha
OTT :18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన పార్లమెంటరీ ప్యానెల్

ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అశ్లీల కంటెంట్‌ను ఇతర సోషల్ మీడియా ఛానళ్లలో షేర్ చేయడాన్ని నిరోధించేందుకు పార్లమెంటరీ కమిటీ కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయాన్ని వినియోగించాలి అని సూచించింది. పునరావృతంగా నేరాలకు పాల్పడుతున్నవారిపై కఠిన శిక్షలు విధించేందుకు ప్రస్తుత చట్టాలు సరిపోవని, అందుకే తాజా సాంకేతికతలకు అనుగుణంగా కొత్త చట్టాలు అవసరం అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది.

అశ్లీల కంటెంట్‌పై చర్యలు

బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నేతృత్వంలోని కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ అంశంపై మోడీ ప్రభుత్వానికి నివేదిక అందించింది.గతంలోనూ అశ్లీల కంటెంట్ కలిగి ఉన్న 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను, 19 వెబ్‌సైట్‌లను, 10 మొబైల్ యాప్‌లను బ్లాక్ చేసినట్లు కమిటీ పేర్కొంది. అయితే టెలిగ్రామ్ ఛానళ్ల వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ కంటెంట్ సులభంగా లభిస్తుండటంతో, దీనికి వ్యతిరేకంగా ఐటీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం

ఐటి చట్టం 2021లోని పార్ట్ త్రీ,ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల గురించి వివరిస్తుంది. ‘ఏ’ రేటింగ్ ఉన్న కంటెంట్‌ను పిల్లలు యాక్సెస్‌ చేయకుండా ఇది నిరోధిస్తోంది. అయితే 18 ఓటీటీలు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లలో బ్లాక్ చేసిన కంటెంట్‌లు టెలిగ్రామ్ ఛానల్ వంటి ఇతర మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సులభంగా అందుబాటు ఉంటోందని, దీన్ని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికను అందించాలని ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుతం చట్టాలు సరిపోతాయా,తాజా సాంకేతికతల నేపథ్యంలో మరింత కఠినమైన చట్టాలు అవసరమా, అనిప్రశ్నించింది.

1725007848 5866

ప్రభుత్వ చర్యలు

అశ్లీల కంటెంట్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకున్నా, కొన్ని ఓటీటీప్లాట్‌ఫారమ్‌లు ప్రోగ్రామ్‌ల పేర్లను మార్చడం, కొత్త ఐపి అడ్రస్‌లను ఉపయోగించడం ద్వారా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ఈ సమస్యను గుర్తించేందుకు,నివారించేందుకు ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగించాలి అని కమిటీ సూచించింది.

సినిమాటోగ్రఫీ చట్టం

అడల్ట్ కంటెంట్‌ను ప్రసారం చేసే డిజిటల్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ఛానళ్లపై సినిమాటోగ్రఫీ చట్టం 2023 ప్రకారం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నారు. అయితే మరింత కఠిన చర్యలు తీసుకోవడం, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను కఠినంగా నియంత్రించడం అవసరం అని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870