हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Pahalgam : పహల్గాం ఉగ్రదాడిపై పాక్ కుట్ర అనుమానాలు వెల్లడి

Digital
Pahalgam : పహల్గాం ఉగ్రదాడిపై పాక్ కుట్ర అనుమానాలు వెల్లడి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి, విదేశీ అతిథులు మరియు అగ్రనాయకులు భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో జరిగినందున, ఇది యాదృచ్ఛికం కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన కుటుంబంతో కలిసి భారత్ పర్యటనలో ఉండగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడి జరగడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.ఈ దాడిని 2000 మార్చి 20న అనంతనాగ్ ఛత్తీసింగ్పోరాలో జరిగిన నరమేధంతో పోలుస్తున్నారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనలో ఉన్న సమయంలో ఉగ్రవాదులు సైనికుల వేషాలలో గ్రామంలోకి ప్రవేశించి 36 మందిని నిష్ఠూరంగా హత్యచేశారు. సైన్యం చేసిన దాడిగా ప్రజలను భ్రమింపజేయాలనే ఉద్దేశంతో ఇది జరిగింది. తర్వాతి దర్యాప్తులో ఇది పాక్ ఉగ్రవాదుల కుట్రగా తేలింది.ఇప్పటి పహల్గాం ఘటన కూడా అదే తరహాలో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఉగ్రవాదులు భారత సైనికుల వేషంలో ప్రవేశించి, పర్యాటకులపై దాడికి పాల్పడారు. ముఖ్యంగా పురుషులనే లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో పాక్ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ ఇటీవల ఓవర్సీస్ పాకిస్థాన్ కన్వెన్షన్లో ఇచ్చిన రెచ్చగొట్టే ప్రసంగం కూడా ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది.

 Pahalgam : పహల్గాం ఉగ్రదాడిపై పాక్ కుట్ర అనుమానాలు వెల్లడి
Pahalgam : పహల్గాం ఉగ్రదాడిపై పాక్ కుట్ర అనుమానాలు వెల్లడి

అంతర్జాతీయ పర్యటనల సమయంలో ఉగ్రదాడులు – పాక్ వ్యూహానికి సంకేతమా

ఆసీమ్ మునీర్ తన ప్రసంగంలో, “కశ్మీర్ మన గొంతులోని రక్తనాళం. అది మన జీవితంలో భాగం. కశ్మీర్‌ను మరిచిపోలేము. మన పిల్లలకు పాకిస్థాన్ కథ చెప్పాలి. హిందువుల కంటే మేము భిన్నం. అందుకే ఈ రెండు దేశాల సిద్ధాంతాలు వేరు,” అని వ్యాఖ్యానించారు. ఈ ప్రసంగం తరువాతే పహల్గాం దాడి జరగడం అనుసంధానం కాకపోతే మరోేమిటి?ఇంతలో పాక్ వాయుసేనకు చెందిన రవాణా, నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి బేసులకు తరలించడమూ గమనార్హం. ఈ చర్యలు భారత సరిహద్దును ఉద్దేశ్యపూర్వకంగా టార్గెట్ చేయాలనే పాక్ ప్రయత్నంలో భాగంగా ఉన్నాయన్న అనుమానాలు వేగంగా పెరుగుతున్నాయి. అంతేకాక, ఈ దాడుల వెనుక అంతర్జాతీయంగా జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాలనే పాక్ లక్ష్యమూ ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ముందడుగు వేస్తోంది.

Read More : Terror Attack : పాక్‌పై భారత్ ప్రతీకారం.. సింధూ జలాల ఒప్పందం రద్దు.. అటారీ-వాఘ సరిహద్దును మూసివేత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870