हिन्दी | Epaper

Supreme Court : పహల్గాం దాడిపై సుప్రీం కోర్టు కఠిన వ్యాఖ్యలు

Digital
Supreme Court : పహల్గాం దాడిపై సుప్రీం కోర్టు కఠిన వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: మన బలగాల స్థైర్యాన్ని దెబ్బతీసే పిటిషన్లకు చోటులేదు

ఉగ్రదాడిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ దాఖలు చేసిన పిటిషనర్లకు, వారి తరపు న్యాయవాదికి ధర్మాసనం చురకలంటించింది.గురువారం జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై స్పందిస్తూ, “సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీయడం ఏ మాత్రం సమంజసం కాదు. ఈ తరహా పిటిషన్ల దాఖలుకు ముందు బాధ్యతగా ఆలోచించాలి. దేశంలోని ప్రతి పౌరుడు ఉగ్రవాదంపై పోరాటానికి సిద్ధంగా ఉన్న తరుణంలో, ఈవిధమైన వ్యాజ్యాలు అందులో చిక్కులు కలిగించకూడదు,” అని హితవు పలికింది.పహల్గాం దాడిలో 26 మంది మరణించగా, దానికి సంబంధించిన పూర్తి విచారణ కోసం రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, “రిటైర్డ్ న్యాయమూర్తులు దర్యాప్తుకు నిపుణులు కారు. వారు తీర్పులు చెప్పే వ్యక్తులు మాత్రమే. ఈ విధంగా దర్యాప్తును కోరడం న్యాయ పరంగా సమంజసం కాదు,” అని స్పష్టం చేసింది.

 Supreme Court : పహల్గాం దాడిపై సుప్రీం కోర్టు కఠిన వ్యాఖ్యలు
Supreme Court : పహల్గాం దాడిపై సుప్రీం కోర్టు కఠిన వ్యాఖ్యలు

Supreme Court : పహల్గాం దాడిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

పిటిషనర్లు ఫతేష్ కుమార్ షాహూ, మొహమ్మద్ జునైద్, విక్కీ కుమార్‌లు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వారు కేంద్ర ప్రభుత్వాన్ని, జమ్మూ కశ్మీర్ యూనియన్ టెరిటరీని, సీఆర్‌పీఎఫ్‌ను, ఎన్ఐఏను కలిపి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని కోరారు. ఉగ్రదాడి ఘటనపై జవాబుదారీతనాన్ని నిర్ధారించాలన్నదే వారి ప్రధాన ఉద్దేశం. అంతేకాదు, జమ్మూ కశ్మీర్ వెలుపల చదువుతోన్న విద్యార్థులపై జరుగుతున్న దాడులపై కూడా విచారణ కోరారు.అయితే, ధర్మాసనం దీనిని తికమకపెట్టే అంశంగా పేర్కొంటూ, “ఇది మన దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం. ఈ సమయంలో ఇటువంటి వ్యాజ్యాలు చేయడం వల్ల దేశ బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయే ప్రమాదం ఉంది. ఈ వ్యవహారంలో ప్రతి పౌరుడు బాధ్యతగా మెలగాలి,” అని తీవ్రంగా హెచ్చరించింది.న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం మరో కీలక వ్యాఖ్య చేస్తూ, “మేము విచారణ జరపాల్సిన వ్యక్తులం కాదు. న్యాయ నిర్ణయాలు చెప్పే వ్యక్తులం మాత్రమే. దయచేసి మమ్మల్ని విచారణ అధికారులుగా చూడవద్దు,” అని పిటిషనర్లకు సూటిగా తెలిపారు.ఈ వ్యాఖ్యలతో ధర్మాసనం పిటిషన్‌ను పూర్తిగా తిరస్కరించింది. దేశంలో ఉగ్రవాదంపై పోరాటానికి ఇది కీలక సమయం అని పునరుద్ఘాటిస్తూ, ఈ సమయంలో సైనికుల ధైర్యాన్ని బలపరిచే చర్యలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.

Read More : TGSRTC Stirke: ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870