हिन्दी | Epaper

Rajnath : గట్టి బదులు చెబుతాం

Digital
Rajnath : గట్టి బదులు చెబుతాం

పహల్గాం దాడిపై రాజ్ నాథ్ స్పందన

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమని, దాడికి గట్టి బదులిస్తామని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఆ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నది భారత్ విధానమని, ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని, కుట్ర పన్నిన వారిని బయటకు లాగి తగిన బుద్ధి చెబుతామన్నారు. పహల్గాం ఘటనపై శ్రీనగర్లో భద్రతా చర్యలపై ఆయన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠితో చర్చించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలోనూ రాజ్ నాథ్ పాల్గొననున్నారు.

 Rajnath : గట్టి బదులు చెబుతాం
Rajnath : గట్టి బదులు చెబుతాం

పహల్గాం దాడిపై రాజ్ నాథ్ స్పందన: ఉగ్రవాదానికి గట్టి బదులు చెబుతాం

ఇటీవలి దాడి ఒక ప్రణాళికాబద్ధమైన చర్యగా భావిస్తున్నారు. గతంలో కూడా పుల్వామా దాడిలో ఒకే విధమైన విధానం అమలులోకి తెచ్చారు. ఉగ్రవాదులు సాధారణ పర్యాటకులపైనే దాడులు జరిపిన కారణంగా ఇది పాక్ ప్రేరేపిత కుట్రగా అనుమానిస్తున్నారు.ఈ దాడి అనంతరం భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో భద్రతను మరింత కఠినంగా చేసింది. సైనికుల సంఖ్యను పెంచడంతో పాటు డ్రోన్, నైట్ విజన్ టెక్నాలజీ వంటి ఆధునిక పరికరాలతో నిఘా పెంచారు. అంతేకాదు, యాత్రలపై కూడా సెక్యూరిటీ ప్రొటోకాల్‌లను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.

Read More :
Terror Attack : పాక్‌పై భారత్ ప్రతీకారం.. సింధూ జలాల ఒప్పందం రద్దు.. అటారీ-వాఘ సరిహద్దును మూసివేత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870