हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Oral bacteria : నోటి బ్యాక్టీరియా లివర్‌ను నాశనం చేస్తుందా? షాకింగ్ స్టడీ!

Sai Kiran
Oral bacteria : నోటి బ్యాక్టీరియా లివర్‌ను నాశనం చేస్తుందా? షాకింగ్ స్టడీ!

Oral bacteria : నోటిలో ఉండే బ్యాక్టీరియా కేవలం దంతాలు, చిగుళ్ల సమస్యలకే పరిమితం కాదని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా క్రమంగా శరీరంలోకి ప్రవేశించి కాలేయం వంటి కీలక అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. నోటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల లివర్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని ఈ అధ్యయనం చెబుతోంది.

సాధారణంగా మనం దంత నొప్పి, చిగుళ్ల రక్తస్రావం వంటి సమస్యలను చిన్నవిగా భావిస్తాం. కానీ తాజా అధ్యయనం ఈ ఆలోచనను మార్చేసింది. నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి చేరి నేరుగా కాలేయాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, మద్యం సేవించే అలవాటు ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Read Also: HYD: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సక్సెస్ మీట్

ఈ పరిశోధనలో 86 మంది రోగుల లాలాజలం, మల నమూనాలను (Oral bacteria) పరిశీలించగా, సాధారణంగా నోటిలో మాత్రమే ఉండే కొన్ని బ్యాక్టీరియా తీవ్రమైన కాలేయ వ్యాధిగ్రస్తుల పేగుల్లో కనిపించాయి. వీటిలో ముఖ్యంగా స్ట్రెప్టోకోకస్ వంటి బ్యాక్టీరియా గుర్తించారు. ఇవి పేగుల రక్షణ వ్యవస్థను బలహీనపరచి, రక్తంలోకి ప్రవేశించి కాలేయంలో వాపును పెంచుతాయని తెలిపారు.

డాక్టర్ల ప్రకారం, బ్రష్ చేయడం లేదా ఆహారం నమలే సమయంలో చిగుళ్లలో ఏర్పడే చిన్న గాయాల ద్వారా బ్యాక్టీరియా రక్తంలోకి వెళ్తుంది. దీని వల్ల దీర్ఘకాలిక వాపు ఏర్పడి ఫ్యాటీ లివర్, లివర్ ఫైబ్రోసిస్ వంటి సమస్యలు రావచ్చు.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజుకు రెండు సార్లు పళ్లను శుభ్రంగా బ్రష్ చేయాలి, ఫ్లాస్ ఉపయోగించాలి, క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించాలి. అలాగే మద్యం మానడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. చిన్న నోటి సమస్యలే పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870