हिन्दी | Epaper

Operation Sindoor : ఆపరేషన్‌ సింధూర్ ముగియలేదు ..కేంద్రం ప్రకటన

Sudha
Operation Sindoor : ఆపరేషన్‌ సింధూర్ ముగియలేదు ..కేంద్రం ప్రకటన

పాకిస్థాన్‌ (Pakistan) లో, పాకిస్థాన్‌ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌ (PoJK) లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) అప్పుడే ముగిసిపోలేదని కేంద్రం ప్రకటించింది. ఆపరేషన్‌ సిందూర్‌ ముగిసిపోలేదని, ఇంకా కొనసాగుతోందని కేంద్ర మంత్రి (Union Minister) కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) వెల్లడించారు.

Operation Sindoor  : ఆపరేషన్‌ సిందూర్‌ ముగియలేదు ..కేంద్రం ప్రకటన
Operation Sindoor : ఆపరేషన్‌ సింధూర్ ముగియలేదు ..కేంద్రం ప్రకటన


అసత్య ప్రచారం నమ్మవద్దు
అయితే భద్రతా కారణాల రీత్య ఆపరేషన్‌ సింధూర్ కు సంబంధించిన వివరాలను బయటపెట్టలేమని అన్నారు. పాకిస్థాన్‌ ప్రభుత్వం ఆపరేషన్‌ సింధూర్‌పై అసత్య ప్రచారం చేస్తోందని రిజిజు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ జరిపిన ప్రతీకార దాడులను పాకిస్తాన్ తక్కువచేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, వాస్తవాలను అధికారిక వర్గాల నుంచే తెలుసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఆపరేషన్‌ సిందూర్‌పై పాకిస్థాన్‌ అసత్య ప్రచారం చేస్తోందని, ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కిరణ్‌ రిజిజు చెప్పారు. కాగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున భారత్‌.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్‌ చేసింది. ఆపరేషన్‌ సిందూర్ పేరుతో నిర్వహించిన ఈ సర్జికల్‌ స్ట్రైక్స్‌లో మొత్తం 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

Read Also : Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌లో 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

📢 For Advertisement Booking: 98481 12870