हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ లోగో వెనక శ్రమించింది ఎవరు?

Anusha
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ లోగో వెనక శ్రమించింది ఎవరు?

భారత సైన్యం పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడి నేపథ్యంలో,వ్యూహాత్మక ప్రతీకారంతో పాటు బలమైన సందేశాన్ని పంపేలా చర్యలు చేపట్టింది. మే 7వ తేదీన ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్‌పై భారత సైన్యం లక్షిత దాడులు నిర్వహించడమే కాకుండా, ఈ ఘటనలో ఎదురైన నష్టాన్ని, న్యాయం కోసం రగిలే ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా ఒక ప్రత్యేక చిహ్నాన్ని (లోగో) కూడా ఆవిష్కరించింది.’ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) పేరిట పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక స్థావరాలు ధ్వంసమయ్యాయి. వీటిలో బహవల్పూర్, ముజఫరాబాద్, కోట్లి, సియాల్‌కోట్‌లోని శిబిరాలు కూడా ఉన్నాయి. హతమైన వారిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

ప్రతీకగా

పహల్గామ్ మారణకాండ అనంతరం నెలకొన్న ఉద్వేగభరిత వాతావరణాన్ని, ముఖ్యంగా భర్తలను కోల్పోయిన మహిళల ఆవేదనను ప్రతిబింబించేలా ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరును ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హిందూ సంప్రదాయంలో వివాహిత మహిళలు ధరించే సిందూరం (కుంకుమ) సౌభాగ్యానికి చిహ్నం. పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయి, సౌభాగ్యం దూరమైన మహిళల దుఃఖానికి ఈ పేరు ప్రతీకగా నిలుస్తుంది.

Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' లోగో వెనక శ్రమించింది ఎవరు?
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ లోగో వెనక శ్రమించింది ఎవరు?

ఆకారం

ఈ ఆపరేషన్ కోసం భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్ ఒక ప్రత్యేక లోగోను రూపొందించారు. ఈ లోగో డిజైన్‌(Logo design)లో ఆపరేషన్ పేరును పెద్ద అక్షరాలతో ముద్రించారు. పేరులోని ఒక ‘O’ అక్షరాన్ని ఎర్రటి సిందూరం ఉన్న గిన్నె ఆకారంలో తీర్చిదిద్దారు. ఆ గిన్నె నుంచి ఒలికినట్లుగా ఉన్న సిందూరం, పహల్గామ్ దాడిలో అమరులైన వారి భార్యల వేదనకు ప్రతీక.గతంలో పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్యలకు ఎక్కువగా సంప్రదాయ సైనిక పేర్లనే పెట్టేవారు. అవి అంతర్గతంగా ఆత్మవిశ్వాసాన్ని నింపేలా, బాహ్యంగా బలాన్ని ప్రదర్శించేలా ఉండేవి. కొన్నిసార్లు ఆపరేషన్ల గోప్యత కోసం, మరికొన్నిసార్లు భారతీయ పురాణాల నుంచి కూడా పేర్లను ఎంచుకునేవారు.

Read Also: Rajasthan: ప్రభుత్వ బడి కోసం అన్నదమ్ములు రూ.15 కోట్లు విరాళం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870