అస్సాం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక మౌలిక సదుపాయ ప్రాజెక్టులను ప్రారంభించారు. అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF), బ్రహ్మపుత్ర నదిపై కుమార్ భాస్కర్ వర్మ సేతు, జాతీయ డేటా సెంటర్, ఐఐఎం-గౌహతి, అలాగే పీఎమ్-ఈబస్ సేవ పథకం కింద 225 ఎలక్ట్రిక్ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ఈశాన్య(NorthEast Development) భారతదేశంలో మౌలిక సదుపాయాలు, రవాణా, డిజిటల్ సేవలు, ఉన్నత విద్య రంగాలను గణనీయంగా బలోపేతం చేయనున్నాయి.
Read Also:PM Modi On Pulwama Attack : పుల్వామా వీరులకు నివాళులర్పించిన పీఎం మోదీ

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అస్సాంలో ప్రధాని పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. డిబ్రూగఢ్లోని మొరాన్ బైపాస్ ప్రాంతంలో నిర్మించిన అత్యవసర ల్యాండింగ్ కేంద్రంలో ప్రధాని విమానం ల్యాండ్ కానుంది. ఈ సౌకర్యం అత్యవసర పరిస్థితుల్లో సైనిక, పౌర విమానాల ల్యాండింగ్కు ఉపయోగపడేలా భారత వాయుసేన సమన్వయంతో నిర్మించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ, సహాయక చర్యలను వేగంగా ప్రారంభించేందుకు ఇది కీలకంగా మారనుంది.
ELF, బ్రహ్మపుత్ర వంతెన, జాతీయ డేటా సెంటర్, IIM గౌహతి, 225 ఎలక్ట్రిక్ బస్సుల సేవలు ప్రారంభం
బ్రహ్మపుత్ర నదిపై రూ.3,030 కోట్లతో నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును(NorthEast Development) కూడా ప్రధాని ప్రారంభించారు. ఆరు లైన్లతో నిర్మించిన ఈ వంతెన గౌహతిని ఉత్తర గౌహతితో అనుసంధానిస్తుంది. ప్రయాణ సమయం కేవలం ఏడు నిమిషాలకు తగ్గేలా రూపకల్పన చేశారు. భూకంప నిరోధక సాంకేతికతతో పాటు బ్రిడ్జి హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ను అమలు చేశారు. అమీన్గావ్లో ఏర్పాటు చేసిన జాతీయ డేటా సెంటర్ను కూడా ప్రారంభించారు. ఇది ప్రభుత్వ సేవలకు డిజిటల్ మద్దతు ఇవ్వడంతో పాటు డిజాస్టర్ రికవరీ కేంద్రంగా పనిచేస్తుంది. ఈశాన్య ప్రాంతాల్లో డిజిటల్ సేవల విస్తరణకు ఇది కీలకంగా నిలవనుంది.
అలాగే ఐఐఎం-గౌహతి ప్రారంభంతో ఈశాన్య భారతంలో ఉన్నత విద్యకు కొత్త దిశ లభించనుంది. మేనేజ్మెంట్ విద్యలో నూతన అవకాశాలు ఏర్పడతాయి. పీఎమ్-ఈబస్ సేవ పథకం కింద 225 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. గౌహతి, నాగ్పూర్, భావ్నగర్, చండీగఢ్ నగరాల్లో ఈ బస్సులు సేవలు అందించనున్నాయి. వీటితో 50 లక్షల మందికి పైగా ప్రజలకు పర్యావరణ హిత, చౌకైన ప్రజా రవాణా సౌకర్యం అందనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: