NHAI: ఫాస్టాగ్ వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అదిరే శుభవార్త అందించింది. కేవలం ఫొటోలు తీసి అప్లోడ్ చేయడం ద్వారా రూ.1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ను ఉచితంగా పొందే అవకాశాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కల్పిస్తోంది.
Read Also:Vizianagaram: కాశీయాత్ర నుంచి తిరిగి వస్తుండగా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి

ఏమిటీ ఛాలెంజ్?
జాతీయ రహదారులపై ఉన్న టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ను ప్రవేశపెట్టింది. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు నేషనల్ హైవేపై ఎక్కడైనా టాయిలెట్లు మురికిగా లేదా పరిశుభ్రత లేకుండా ఉంటే, వెంటనే వాటిని ఫొటోలు తీయాలి.
రూ.1000 ఎలా పొందాలి?
- ఆ ఫొటోలను ‘Rajmargyatra’ యాప్లో లొకేషన్ వివరాలతో సహా అప్లోడ్ చేయాలి.
- మీరు చేసిన ఫిర్యాదును అధికారులు పరిశీలించి, అది నిజమని నిర్ధారిస్తారు.
- ఫిర్యాదు నిజమని తేలితే, కేవలం 5 రోజుల్లో మీ ఫాస్టాగ్ అకౌంట్లోకి రూ.1,000 క్రెడిట్ అవుతాయి.
ఈ అద్భుతమైన అవకాశం గడువును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా 2026 జూన్ 30 వరకు పొడిగించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: