లోక్సభ (Lok Sabha) శుక్రవారం పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్సు విధిస్తూ, తద్వారా వచ్చే నిధులను జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి వినియోగించాలని ప్రతిపాదించే ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్సు బిల్లు-2025’ కు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also: Flight Ticket Price Hike : భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు..ప్రయాణికుల గగ్గోలు
పాన్ మసాలా కంపెనీలపై సెస్సును ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ, ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి, సెస్సు ద్వారా వచ్చే నిధులను రాష్ట్రాలతో పంచుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

ఉత్పత్తులను తయారు చేసే యూనిట్ల
ఈ సెస్సు ద్వారా సమకూరిన నిధులను జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి వినియోగించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు దిగువ సభలో ఈ బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు.పాన్ మసాలా, ఈ తరహా ఉత్పత్తులను తయారు చేసే యూనిట్లకు ఈ సెస్సు వర్తిస్తుంది. జాతీయ ఆరోగ్యం, జాతీయ భద్రత వంటి అంశాలకు ఈ నిధులను వినియోగిస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం పాన్ మసాలాపై జీఎస్టీ గరిష్ఠ శ్లాబు అయిన 40 శాతం విధిస్తున్నట్లు ఆమె తెలిపారు.ఈ సెస్సు వల్ల జీఎస్టీ రాబడిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. తయారీ సామర్థ్యం ఆధారంగా ఈ సెస్సును విధిస్తామని పేర్కొన్నారు. 2010-14 మధ్య సెస్సుల రూపంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 7 శాతంగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం 6.1 శాతానికి తగ్గినట్లు ఆమె వెల్లడించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: