हिन्दी | Epaper

Latest News: Lok Sabha: పాన్ మసాలాపై కొత్త సెస్సు.. బిల్లును ఆమోదించిన లోక్ సభ

Aanusha
Latest News: Lok Sabha: పాన్ మసాలాపై కొత్త సెస్సు.. బిల్లును ఆమోదించిన లోక్ సభ

లోక్‌సభ (Lok Sabha) శుక్రవారం పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్సు విధిస్తూ, తద్వారా వచ్చే నిధులను జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి వినియోగించాలని ప్రతిపాదించే ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్సు బిల్లు-2025’ కు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read Also: Flight Ticket Price Hike : భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు..ప్రయాణికుల గగ్గోలు

పాన్ మసాలా కంపెనీలపై సెస్సును ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ, ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి, సెస్సు ద్వారా వచ్చే నిధులను రాష్ట్రాలతో పంచుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

New cess on pan masala.. Lok Sabha approves bill
New cess on pan masala.. Lok Sabha approves bill

ఉత్పత్తులను తయారు చేసే యూనిట్ల

ఈ సెస్సు ద్వారా సమకూరిన నిధులను జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి వినియోగించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు దిగువ సభలో ఈ బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు.పాన్ మసాలా, ఈ తరహా ఉత్పత్తులను తయారు చేసే యూనిట్లకు ఈ సెస్సు వర్తిస్తుంది. జాతీయ ఆరోగ్యం, జాతీయ భద్రత వంటి అంశాలకు ఈ నిధులను వినియోగిస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం పాన్ మసాలాపై జీఎస్టీ గరిష్ఠ శ్లాబు అయిన 40 శాతం విధిస్తున్నట్లు ఆమె తెలిపారు.ఈ సెస్సు వల్ల జీఎస్టీ రాబడిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. తయారీ సామర్థ్యం ఆధారంగా ఈ సెస్సును విధిస్తామని పేర్కొన్నారు. 2010-14 మధ్య సెస్సుల రూపంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 7 శాతంగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం 6.1 శాతానికి తగ్గినట్లు ఆమె వెల్లడించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

తిరుమల లడ్డూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

తిరుమల లడ్డూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!
0:51

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!

100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్!.. రష్యా ఆయిల్‌పై అమెరికా కీలక నిర్ణయం!

100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్!.. రష్యా ఆయిల్‌పై అమెరికా కీలక నిర్ణయం!

వార్నీ.. ఇదెక్కడి విడ్డూరం! ఇడ్లీ తింటే గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలా?

వార్నీ.. ఇదెక్కడి విడ్డూరం! ఇడ్లీ తింటే గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలా?

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ఎందుకని తప్పుకున్నారు?

అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ఎందుకని తప్పుకున్నారు?

పెరిగిన వంట నూనె ధరలు

పెరిగిన వంట నూనె ధరలు

యుద్ధంతో వంటగదిలో కిరోసిన్ సెగ

యుద్ధంతో వంటగదిలో కిరోసిన్ సెగ

అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!

అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!

📢 For Advertisement Booking: 98481 12870