దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. నేషనల్ ఎక్స్ప్రెస్వేల (National High way) పై టోల్ వసూలు నిబంధనల్లో మార్పులు చేసింది. ఇకపై పూర్తిగా అందుబాటులోకి రాని ఎక్స్ప్రెస్ వేల్లో మొత్తం టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. పనులు పూర్తయిన మేరకే ఛార్జీలు వసూలు చేస్తారు. ఆదివారం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దాంతో కొంత భాగమే ప్రారంభించిన ఎక్స్ప్రెస్ వేలపై టోల్ భారం తగ్గనుంది. ప్రస్తుతం నేషనల్ హైవేలతో పోలిస్తే ఎక్స్ప్రెస్ వేలపై 25% ఎక్కువగా వసూలు చేస్తున్నారు.
Read Also: Tharu tribe dowry ban : కట్నం పాపం అంటున్న తెగ, దేశానికి ఆదర్శమా?

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: