हिन्दी | Epaper

Telugu News: Nara lokesh -నేపాల్ బాధితులతో వీడియో కాల్ తో మంత్రి లోకేశ్‌ ఓదార్పు

Sushmitha
Telugu News: Nara lokesh -నేపాల్ బాధితులతో వీడియో కాల్ తో మంత్రి లోకేశ్‌ ఓదార్పు

Nara lokesh: నేపాల్‌లో జరుగుతున్న ఆందోళనల కారణంగా రాజధాని ఖాట్మండులో(Kathmandu) చిక్కుకుపోయిన మంగళగిరి వాసులతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ నేరుగా మాట్లాడారు. వీడియో కాల్ ద్వారా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నేపాల్‌లో(Nepal) మొత్తం 241 మంది ఆంధ్రప్రదేశ్ యాత్రికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది.

యాత్రికుల ఆవేదన, ప్రభుత్వ భరోసా

మంగళగిరికి చెందిన మాచర్ల హేమసుందర్ రావు, దామర్ల నాగలక్ష్మి తదితర 8 మంది యాత్రికులు ప్రస్తుతం ఖాట్మండు ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న ఒక హోటల్‌లో ఉన్నారు. వీరు మంత్రి లోకేశ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడి తమ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేశారని, తీవ్ర భయాందోళనకు గురయ్యామని తెలిపారు. తమతో పాటు మరో 40 మంది తెలుగువారు కూడా అదే హోటల్‌లో ఉన్నట్లు వారు వివరించారు.

దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్‌,(Minister Lokesh)ఎవరూ ఆందోళన చెందవద్దని, అందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. బాధితులతో నిరంతరం టచ్‌లో ఉండి, వారికి అవసరమైన సహాయాన్ని అందించడానికి రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావును నియమించినట్లు తెలిపారు.

ఉన్నతాధికారులతో లోకేశ్ సమీక్ష

ఈ విషయంపై మంత్రి లోకేశ్‌(Nara lokesh) వెంటనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీ భవన్ అధికారి అర్జా శ్రీకాంత్‌తో పాటు సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, ముఖేశ్ కుమార్ మీనా, కోన శశిధర్, అజయ్ జైన్, హిమాన్షు శుక్లా, జయలక్ష్మి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నేపాల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని లోకేశ్‌ అధికారులను ఆదేశించారు.


నేపాల్‌లో ఎంతమంది ఏపీ యాత్రికులు చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు?

ప్రాథమిక సమాచారం ప్రకారం, మొత్తం 241 మంది ఏపీకి చెందిన యాత్రికులు చిక్కుకున్నారు.

చిక్కుకున్న యాత్రికులు ఎక్కడ ఉన్నారు?

మంగళగిరి యాత్రికులతో సహా కొంతమంది ఖాట్మండు ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఒక హోటల్‌లో తలదాచుకుంటున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/lokesh-tries-to-bring-back-ap-residents-stranded-in-nepal-to-india/andhra-pradesh/544447/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870