ముంబై (Mumbai) మేయర్ ఎన్నికపై నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. సుదీర్ఘ చర్చల తర్వాత రోజుల తరబడి నెలకొన్న సస్పెన్స్ తొలగిపోయింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత శివసేన పట్టు తప్పి, ముంబై మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగిరింది. ఇటీవల జరిగిన బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘనవిజయం సాధించినప్పటికీ, మేయర్ ఎంపికపై బీజేపీ (BJP), ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య గత నెల రోజులుగా తీవ్ర చర్చలు జరిగాయి. చివరకు మేయర్ పదవిని బీజేపీ దక్కించుకోగా, డిప్యూటీ మేయర్ పదవి శివసేనకు కేటాయించారు.
Read Also: CoalMine Blast: 25 మంది మృతి, అక్రమ మైనింగ్పై తీవ్ర విమర్శలు

డిప్యూటీ మేయర్ పదవి
(Mumbai) మేయర్గా బీజేపీ సీనియర్ నేత రీతూ తాన్డే, డిప్యూటీ మేయర్గా శివసేన కౌన్సిలర్ సంజయ్ ఘడి ఎన్నికయ్యారు.5వ వార్డు నుంచి గెలిచిన సంజయ్ శంకర్ ఘాడీని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. డిప్యూటీ మేయర్ పదవికి పార్టీలోని నలుగురు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. దీంతో సంజయ్ శంకర్ ఘాడీ వచ్చే 15 నెలల పాటు డిప్యూటీ మేయర్ గా కొనసాగుతారని, ఆ తర్వాత మరో అభ్యర్థిని శివసేన ఆ సీట్లో కూర్చోబెడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com