కశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి కేవలం మతాల మధ్య యుద్ధం కాదు, అది ధర్మం మరియు అధర్మం మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన స్పష్టం చేశారు. భగవత్ గారు మాట్లాడుతూ, ఇటువంటి దాడులు దేశంలోని శాంతిని భంగం చేస్తున్నాయని, శాంతిని పౌరుషంతో కాపాడాలనే పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా భగవత్ గారు రామాయణాన్ని ప్రస్తావించి, రావణుడు యొక్క అమానుష స్వభావం ని ఉద్దేశించి, రావణుడు చివరి వరకు మారలేదు, అలాగే కొందరు దుర్మార్గులు కూడా మారరు, అని వ్యాఖ్యానించారు. ఈ ఉగ్రవాదులను పాకిస్థాన్కు సంబంధించిన వారిగా ఉద్దేశిస్తూ, పాకిస్థాన్కు ఎన్నో అవకాశాలు ఇచ్చాం, కానీ వారు మారలేదు. అలాంటి వారు తప్పకుండా నశించాలి, అని ఆయన తీవ్రతరంగంలో చెప్పారు.
పాకిస్థాన్పై భగవత్ వ్యాఖ్యలు :
పాకిస్థాన్ దేశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాకిస్థాన్తో మా సంబంధాలు సత్యంగా, న్యాయంగా, మానవతా విలువలతో ఉండాలని ఎంతో ఆశించినా, వారి దుర్మార్గపు చర్యలు దేశంలో తీవ్ర అసందర్భాలను సృష్టిస్తున్నాయి, అని భగవత్ అన్నారు. ఇలాంటి దాడులను నివారించడానికి, దుష్టశక్తులను నిలువరించడానికి సమాజంలో ఐక్యత అత్యంత కీలకమని భగవత్ నొక్కిచెప్పారు. మనం ఐక్యంగా ఉంటే, ఎవరూ మనవైపు దురుద్దేశంతో చూసే సాహసం చేయరు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే, వారి కళ్లు పేలిపోతాయి అని హెచ్చరించారు. ప్రజల భద్రత విషయంలో అంచనాలు ఉన్నాయని, అవి నెరవేరతాయని అన్నారు. పాకిస్థాన్కు భారత ప్రభుత్వం దీటుగా సమాధానం ఇస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
Read also: Danish Kaneria: పాక్లో పహల్గాం బాధితుల పరిస్థితే నాది కూడా: డానిష్ కనేరియా