हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Sanjay Raut: త్వరలో మోడీ పదవీ విరమణ..సంజయ్ రౌత్

Vanipushpa
Sanjay Raut: త్వరలో మోడీ పదవీ విరమణ..సంజయ్ రౌత్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దాదాపు 10 సంవత్సరాల తర్వాత సోమవారం రోజు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ప్రధాని మోదీ పదవీ విరమణ చేయాలని ఆలోచిస్తున్నారని.. ఆ విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు చెప్పేందుకే అక్కడకు వెళ్లారని తెలిపారు. సెప్టెంబర్ నెలలోనే ప్రధాని పదవిని వీడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆయన రాజకీయ వారసుడు మహారాష్ట్ర నుంచి వస్తారని వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

త్వరలో మోడీ పదవీ విరమణ..సంజయ్ రౌత్

11 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన మోడీ
భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి.. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లలేదు. దాదాపు 11 ఏళ్ల తర్వాత అంటే ఆదివారం రోజు నాగ్‌పుర్‌లోని సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా డా.హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లారు. ఆపై సంస్థ వ్యవస్థాపకుడు డా.కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, రెండో సర్‌సంఘ్ చాలక్ ఎంఎస్ గోళ్వాల్కర్‌లకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత స్మృతి భవన్‌లో ఆర్ఎస్ఎస్ అధికారులు అందరితో కలిసి సమావేశం అయ్యారు. ఆపై ఫొటోలు కూడా దిగి సందడి చేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కూడా కలిసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
దేశ నాయకత్వంలో మార్పును కోరుకున్న ఆర్ఎస్ఎస్
ఇదంతా ఇలా ఉడంగా.. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ఆర్ఎస్ఎస్ దేశ నాయకత్వంలో మార్పును కోరుకుంటుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. అలాగే కొత్త బీజేపీ చీఫ్‌ను ఎన్నుకోవాలనుకుంటున్నారని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఆ సంస్థ నియమాల ప్రకారం ప్రధాని మోదీ కూడా రాజకీయాలకు పదవీ విరమణ ప్రకటించాలని అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిసి..
అందుకే ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిసి రిటైర్మెంట్ పత్రాన్ని సమర్పించేందుకే అక్కడికి వెళ్లుంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇది మాత్రమే కాకుండా ప్రధాన మోదీ రాజకీయ వారసుడు మహారాష్ట్ర నుంచే వస్తారని తాను గట్టిగా నమ్ముతున్నట్లు సంజయ్ రౌత్ తెలిపారు. తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.
మోదీ ఇప్పుడే పదవీ విరమణ చేసే అవకాశం లేదని.. ఆయన నాయకత్వంలో తామింకా చాలా ఏళ్ల పని చేస్తామని వివరించారు. ఇప్పుడు మాత్రమే కాదని వచ్చే ప్రధాన మంత్రి ఎన్నికల్లో కూడా మోదీయే విజయం సాధించి.. 5 ఏళ్ల పాటు ప్రధానిగా సేవలు అందిస్తారని అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870