हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

భారత్ కు బయల్దేరిన మోదీ.

Anusha
భారత్ కు బయల్దేరిన మోదీ.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 12, 13) జరిగిన ఈ పర్యటన అనంతరం మోదీ స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రముఖ రాజకీయ నాయకురాలు తులసీ గబ్బార్డ్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి తదితరులతో భేటీ అయ్యారు.భారత్-అమెరికా సంబంధాల బలోపేతం, పెట్టుబడులు, వాణిజ్య సహకారం, నూతన వృత్తిపరమైన అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధి, గ్లోబల్ టెక్నాలజీ రంగంలో భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ప్రధానంగా, మోదీ-ట్రంప్ భేటీ ద్వైపాక్షిక సంబంధాల పరంగా గణనీయమైన ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా రంగ సహకారం, వ్యూహాత్మక మైత్రి, ఆర్థిక వ్యాపార ఒప్పందాలపై వారు విస్తృతంగా చర్చించారు.మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) మైఖేల్‌ వాల్జ్‌ తోనూ ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. భారత్‌-అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రతా రంగాలు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లు, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలూ పరస్పర సహకారం పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఈ భేటీలో పేర్కొన్నారు.

AP25044782596633 1739484968

అమెరికాలో అక్రమంగా నివసిస్తోన్న భారత వలసదారుల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. అక్రమంగా, అనధికారికంగా ఎవరు కూడా ఏ దేశంలోనూ నివసించలేరని, వారికి ఆ అర్హత సైతం లేదని చెప్పారు. అలాంటి వారిని ఏ దేశం కూడా భరించదనీ స్పష్టం చేశారు. ఇది తమ విషయంలోనూ వర్తిస్తుందని అన్నారు. అమెరికాలో నివసించే తమ దేశ అక్రమ వలసదారులను వెనక్కి పిలిపించుకుంటామని మోదీ తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తాము ముందు నుంచీ చెబుతూనే వస్తోన్నామని పేర్కొన్నారు. వెరిఫికేషన్ తరువాత నిజమైన భారత పౌరుడిని తాము స్వదేశానికి వెనక్కి పిలిపించుకుంటామని అన్నారు. అక్రమ వలసదారుల్లో చాలామంది ఆర్డినరీ ఫ్యామిలీ కు చెందిన వాళ్లని వ్యాఖ్యానించారు మోదీ. వారికి మాయమాటలు చెప్పి అమెరికాకు తరలించివుండొచ్చని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా వ్యవస్థ మొత్తాన్నీ తుడిచేయాల్సిన అవసరం ఉందని మోదీ ఘాటుగా చెప్పారు. ఈ విషయంలో అమెరికాకు పూర్తి సహకారాన్ని అందిస్తామని అన్నారు.

మోదీ ఫ్రాన్స్ పర్యటన హైలైట్స్

ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదపడింది. రక్షణ, వాణిజ్యం, విద్య, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారం పెంపొందించే అంశాలపై చర్చలు జరిగాయి.

వాణిజ్య ఒప్పందాలపై కీలక ప్రకటన

అత్యాధునిక రక్షణ వ్యవస్థలు, మిలిటరీ ఉత్పత్తుల విక్రయాల పెంపు, ఇంధన సరఫరా వంటి అంశాలపై అమెరికా–భారత్ మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశమున్నట్లు ట్రంప్ వెల్లడించారు. త్వరలో పెద్ద ఎత్తున వాణిజ్య ఒప్పందాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

ఎఫ్-31 యుద్ధ విమానాల విక్రయంపై అమెరికా సిద్ధం

భారత వైమానిక దళానికి అధునాతన ఎఫ్-31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. భారత్ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదురుతుందని వెల్లడించారు.

ఇంధన, మిలిటరీ సరఫరా పెంపు

భారత్‌కు చమురు, గ్యాస్ సరఫరా మరింత పెంచేందుకు అమెరికా సానుకూలంగా ఉందని ట్రంప్ తెలిపారు. రక్షణ రంగంలో మిలిటరీ ఉత్పత్తుల సరఫరా పెంచేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. 2025 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్య విలువ మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

IEEPA చట్టం అంటే ఏమిటి?..ట్రంప్ సర్కారు రూ. 26 లక్షల కోట్లు ఆదాయం

IEEPA చట్టం అంటే ఏమిటి?..ట్రంప్ సర్కారు రూ. 26 లక్షల కోట్లు ఆదాయం

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

భారత్‌ రానున్న పాప్​ సంచలనం షకీరా

భారత్‌ రానున్న పాప్​ సంచలనం షకీరా

ఎట్టకేలకు కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం..

ఎట్టకేలకు కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం..

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు!

అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు!

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

📢 For Advertisement Booking: 98481 12870