हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

భారత్ కు బయల్దేరిన మోదీ.

Anusha
భారత్ కు బయల్దేరిన మోదీ.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 12, 13) జరిగిన ఈ పర్యటన అనంతరం మోదీ స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రముఖ రాజకీయ నాయకురాలు తులసీ గబ్బార్డ్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి తదితరులతో భేటీ అయ్యారు.భారత్-అమెరికా సంబంధాల బలోపేతం, పెట్టుబడులు, వాణిజ్య సహకారం, నూతన వృత్తిపరమైన అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధి, గ్లోబల్ టెక్నాలజీ రంగంలో భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ప్రధానంగా, మోదీ-ట్రంప్ భేటీ ద్వైపాక్షిక సంబంధాల పరంగా గణనీయమైన ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా రంగ సహకారం, వ్యూహాత్మక మైత్రి, ఆర్థిక వ్యాపార ఒప్పందాలపై వారు విస్తృతంగా చర్చించారు.మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) మైఖేల్‌ వాల్జ్‌ తోనూ ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. భారత్‌-అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రతా రంగాలు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లు, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలూ పరస్పర సహకారం పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఈ భేటీలో పేర్కొన్నారు.

AP25044782596633 1739484968

అమెరికాలో అక్రమంగా నివసిస్తోన్న భారత వలసదారుల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. అక్రమంగా, అనధికారికంగా ఎవరు కూడా ఏ దేశంలోనూ నివసించలేరని, వారికి ఆ అర్హత సైతం లేదని చెప్పారు. అలాంటి వారిని ఏ దేశం కూడా భరించదనీ స్పష్టం చేశారు. ఇది తమ విషయంలోనూ వర్తిస్తుందని అన్నారు. అమెరికాలో నివసించే తమ దేశ అక్రమ వలసదారులను వెనక్కి పిలిపించుకుంటామని మోదీ తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తాము ముందు నుంచీ చెబుతూనే వస్తోన్నామని పేర్కొన్నారు. వెరిఫికేషన్ తరువాత నిజమైన భారత పౌరుడిని తాము స్వదేశానికి వెనక్కి పిలిపించుకుంటామని అన్నారు. అక్రమ వలసదారుల్లో చాలామంది ఆర్డినరీ ఫ్యామిలీ కు చెందిన వాళ్లని వ్యాఖ్యానించారు మోదీ. వారికి మాయమాటలు చెప్పి అమెరికాకు తరలించివుండొచ్చని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా వ్యవస్థ మొత్తాన్నీ తుడిచేయాల్సిన అవసరం ఉందని మోదీ ఘాటుగా చెప్పారు. ఈ విషయంలో అమెరికాకు పూర్తి సహకారాన్ని అందిస్తామని అన్నారు.

మోదీ ఫ్రాన్స్ పర్యటన హైలైట్స్

ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదపడింది. రక్షణ, వాణిజ్యం, విద్య, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారం పెంపొందించే అంశాలపై చర్చలు జరిగాయి.

వాణిజ్య ఒప్పందాలపై కీలక ప్రకటన

అత్యాధునిక రక్షణ వ్యవస్థలు, మిలిటరీ ఉత్పత్తుల విక్రయాల పెంపు, ఇంధన సరఫరా వంటి అంశాలపై అమెరికా–భారత్ మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశమున్నట్లు ట్రంప్ వెల్లడించారు. త్వరలో పెద్ద ఎత్తున వాణిజ్య ఒప్పందాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

ఎఫ్-31 యుద్ధ విమానాల విక్రయంపై అమెరికా సిద్ధం

భారత వైమానిక దళానికి అధునాతన ఎఫ్-31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. భారత్ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదురుతుందని వెల్లడించారు.

ఇంధన, మిలిటరీ సరఫరా పెంపు

భారత్‌కు చమురు, గ్యాస్ సరఫరా మరింత పెంచేందుకు అమెరికా సానుకూలంగా ఉందని ట్రంప్ తెలిపారు. రక్షణ రంగంలో మిలిటరీ ఉత్పత్తుల సరఫరా పెంచేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. 2025 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్య విలువ మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870