భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (ఫిబ్రవరి 23) మధ్యాహ్నం మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ప్రసిద్ధ బాగేశ్వర్ ధామ్ను సందర్శించారు. ఈ సందర్భంగా బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి స్వామి ధీరేంద్ర కృష్ణ శాస్త్రితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమంలో క్యాన్సర్ ఆస్పత్రికి మోదీ శంకుస్థాపన చేశారు. హిందువుల ఐక్యతకు ధీరేంద్ర శాస్త్రి చేస్తున్న కృషని ప్రధాని కొనియాడారు

క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన
బాగేశ్వర్ ధామ్ ఆశ్రమంలో రూ. 252 కోట్ల వ్యయంతో నిర్మించనున్న క్యాన్సర్ ఆసుపత్రికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఆసుపత్రి బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరిట స్థాపితమవుతోంది. దీని ద్వారా చుట్టుపక్కల ఏడు జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఆసుపత్రి ప్రత్యేకతలు
స్థల విస్తీర్ణం: 2.37 లక్షల చదరపు అడుగులు పిరమిడ్ ఆకారంలో ప్రణాళికలు సిద్ధం సహజ కాంతితో కాలుష్య రహిత వాతావరణం మొదటి దశలో 100 పడకల సౌకర్యం అలాగే 4,124 చదరపు మీటర్ల విస్తీర్ణంపైన అంతస్తు 816 చదరపు మీటర్ల విస్తీర్ణం
ధీరేంద్ర కృష్ణ శాస్త్రిపై ప్రధాని ప్రశంసలు
ప్రధాని మోదీ తన ప్రసంగంలో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి హిందూ ఐక్యత కోసం చేస్తున్న కృషిని ప్రశంసించారు. ధీరేంద్ర శాస్త్రి ఈ ఆసుపత్రి నిర్మాణ బాధ్యత తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ధీరేంద్ర శాస్త్రి ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఐక్యత మంత్రాన్ని కూడా ఇస్తున్నారు. ఈ క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించే బాధ్యత తీసుకున్నారు. ఇక నుంచి బాగేశ్వర్ ధామ్లో, ఆహారం, ఆరోగ్యకరమైన జీవితం, ఆశీర్వాదాలు లభిస్తాయి. దీన్ని సంకల్పించిన ధీరేంద్ర శాస్త్రిని అభినందిస్తున్నానని ప్రధాని అన్నారు. హనుమంతుని ఆశీస్సులతో, ఈ విశ్వాస కేంద్రం ఇప్పుడు ఆరోగ్య కేంద్రంగా మారబోతోంది. ఇక్కడ బాగేశ్వర్ ధామ్ క్యాన్సర్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్న ప్రధాని, ఈ సంస్థ 10 ఎకరాల్లో నిర్మించబడుతుంది మొదటి దశలోనే ఇది 100 పడకల సౌకర్యాన్ని కలిగి ఉంటుందన్నారు. దీని వల్ల బుందేల్ఖండ్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్లు
మహాకుంభ్పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అన్నారు. హిందూ సంస్కృతిని దూషించే వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ధీరేంద్ర శాస్త్రి భక్తులకు భజన, ఆహారం, ఆరోగ్యకరమైన జీవితం అందిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య కేంద్రంగా కూడా బాగేశ్వర్ ధామ్ మారబోతోంది అని పేర్కొన్నారు. బుందేల్ఖండ్ ప్రాంతానికి కొత్త వైద్య కేంద్రం ఈ ఆసుపత్రి బుందేల్ఖండ్ ప్రజలకు మెరుగైన క్యాన్సర్ చికిత్స అందించేందుకు కీలక భూమిక పోషించనుంది. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కావడం ద్వారా ప్రాంతంలో అత్యాధునిక వైద్య సేవలకు నాంది పడనుంది.