MEA Helpline Numbers: పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత భయానకంగా మారుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఒకవైపు, ఇరాన్ మరొకవైపు జరుపుతున్న భీకర దాడులతో గల్ఫ్ ప్రాంతం యుద్ధ భూమిని తలపిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది భారత పౌరుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎలాగైనా సరే తమ పౌరులను రక్షించుకోవాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది.
యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులకు తక్షణ సాయం అందించేందుకు న్యూఢిల్లీలో స్పెషల్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. భారతీయుల భద్రత కోసం విదేశాంగ శాఖ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను కేటాయించింది. ఢిల్లీలోని కంట్రోల్ రూమ్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేస్తుందని అధికారులు వెల్లడించారు.
Read Also: Israel Airspace: పరిమిత సంఖ్య లో కొనసాగనున్న విమాన రాకపోకలు

న్యూఢిల్లీలో స్పెషల్ కంట్రోల్ రూమ్
యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులకు తక్షణ సహాయం అందించేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు కింది నంబర్ల ద్వారా అధికారులను సంప్రదించవచ్చు:
- టోల్ ఫ్రీ నంబర్: 1800118797
- ఇతర ఫోన్ నంబర్లు: +91 11 2301 2113, +91 11 2301 4104, +91 11 2301 7905
విదేశాల్లోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ నంబర్లు
ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు నిరంతరం పౌరులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వివిధ దేశాల్లో ఉన్నవారు సంప్రదించాల్సిన నంబర్లు ఇక్కడ ఉన్నాయి:
- ఇజ్రాయెల్: +972 54 7520711, +972 54 242837
- ఇరాన్: +98 9128109115, +98 9128109102, +98 9128109109
- యూఏఈ (UAE): 800 46342, +971 543090571 (వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించవచ్చు)
యుద్ధం కారణంగా విమాన సర్వీసుల్లో అంతరాయం కలగడం, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉన్నందున.. భారతీయులు అనవసర ప్రయాణాలు చేయవద్దని ప్రభుత్వం హెచ్చరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: