Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లా ధరమ్పురి గ్రామంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ గొడవల నేపథ్యంలో దారికాచి సొంత బాబాయ్ కడతేర్చాడు. అక్కా తమ్ముడు శీతల్ (20), కుల్దీప్ (18) అనే ఈ ఇద్దరు విద్యార్థులు శుక్రవారం ఉదయం తమ లక్ష్యం వైపు అడుగులు వేస్తుండగా, మృత్యువు వారిని వెన్నాడుతూ వచ్చింది. ఉదయాన్నే హాల్ టిక్కెట్లు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. ఇంటి నుంచి కొద్దిదూరం వెళ్లగానే, దారిలో పొంచి ఉన్న వారి సొంత బాబాయ్ హరిసింగ్ మాలవీయ ఒక్కసారిగా కర్రతో దాడి చేశాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో వారిద్దరూ అక్కడికక్కడే కుప్పకూలారు.
Read Also: War Effect: శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు 12 విమానాలు రద్దు

రక్తంతో తడిసిన హాల్టిక్కెట్లు
పరీక్ష రాసేందుకు వెళ్లిన బిడ్డలు రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉండటం చూసి వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుకుని కుటుంబానికి వెలుగునిస్తారనుకున్న బిడ్డలను సొంత బాబాయే కొట్టి చంపడం కలిచివేస్తోంది. వారి హాల్టిక్కెట్లు రక్తంతో తడిసిపోవడం చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. వాళ్లు పరీక్షకు వెళుతున్నారని అతడి(వారి బాబాయి)కి తెలుసు. ఉదయం నుంచే అక్కడ కాపుకాచి మా ఇంటి దీపాలను ఆర్పేశాడు. చదువుకుని గొప్పవాళ్లవుతారనుకుంటే.. ఇలా శవాలుగా పడి ఉన్నారు అంటూ మృతుల తండ్రి జగదీశ్ మాలవీయ రోదించారు. కుటుంబ ఆస్తి తగాదాలే ఈ ఘాతుకానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. హత్య చేసి పారిపోయిన హరిసింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: