ఫుట్బాల్ స్టార్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ పర్యటన అదిరింది! రాజీవ్ గాంధీ స్టేడియంలో అభిమానులను ఉర్రూతలూగించి, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్బాల్ ఆడాడు. రాహుల్ గాంధీని కలిసిన మెస్సీ ఆ తర్వాత సన్మానం అందుకున్నాడు. కోల్కతాలో జరిగిన గందరగోళానికి పూర్తి భిన్నంగా, హైదరాబాద్లో మెస్సీ పర్యటన విజయవంతమైంది.
Read Also: Naga Vamsi: HYDలో జరిగిన మెస్సీ టూర్పై నాగవంశీ ప్రశంసలు
సచిన్ టెండూల్కర్తో మెస్సీ భేటీ
మెస్సీ (Lionel Messi) తన ‘గోట్ టూర్’లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ముంబై చేరుకున్నాడు. తన భారత పర్యటనలో కోల్కతా, హైదరాబాద్ల తర్వాత ఇది మూడో మజిలీ. ముంబైలో మెస్సీ పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే ఓ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో మెస్సీ భేటీ కానున్నాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు వాంఖడే స్టేడియంలో బాలీవుడ్ ప్రముఖులతో కలిసి మెస్సీ ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.

‘గోట్ ఫుట్బాల్ క్లినిక్’లో భాగంగా
అనంతరం జరిగే ఓ ప్రైవేట్ ఫ్యాషన్ షోలో, 2022 ఫిఫా వరల్డ్ కప్కు సంబంధించిన తన వస్తువులను మెస్సీ వేలం వేయనున్నాడు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘గోట్ ఫుట్బాల్ క్లినిక్’లో భాగంగా మెస్సీ చిన్నారులకు ఫుట్బాల్ మెళకువలు నేర్పించనున్నాడు. భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాడని తెలుస్తోంది.
నిన్న కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకుల వైఫల్యం కారణంగా గందరగోళం చెలరేగింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముంబై పోలీసులు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.ముంబై పర్యటన ముగిశాక, మెస్సీ తన టూర్లో చివరి నగరమైన ఢిల్లీకి బయలుదేరి వెళతాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: