हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Operation Sindoor: ఉగ్రదాడుల వేళ కేంద్రం కీలక ప్రకటన

Anusha
Operation Sindoor: ఉగ్రదాడుల వేళ కేంద్రం కీలక ప్రకటన

సరిహద్దుల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్ ఇప్పటికే పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. భారత్ పై పాకిస్తాన్ చేస్తున్న దాడుల నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటనచేసింది. ఇక నుంచి భారత్‌పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇలాంటి యుద్ధ చర్యలకు భారత త్రివిధ దళాలు దీటుగా ప్రతిస్పందిస్తాయని తీవ్ర హెచ్చరికలు(Warnings) జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ తన వైఖరిని కఠినతరం చేసినట్లు అర్థం అవుతోంది. ఇక నుంచి భారత భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగే ఏ ఉగ్రదాడినైనా యుద్ధంగానే పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.పహల్గామ్ ఉగ్రదాడి దానికి కౌంటర్‌గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ సిందూర్‌తో షాక్‌కు గురైన పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి విరుచుకుపడుతోంది. ఒకవైపు నియంత్రణ రేఖ(Control line) వద్ద పాకిస్తాన్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు. పౌరులు, ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు అనే తేడా లేకుండా భీకర కాల్పులకు తెగబడుతున్నారు. మరోవైపు డ్రోన్లు, క్షిపణులతో గగనతలంలో భీకర దాడులకు దిగుతున్నారు. అయితే భూమి, ఆకాశంలో పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టి పాక్‌కే గట్టి బుద్ధి చెబుతోంది.

cr 20250510tn681f1557aac2a
ఉగ్రదాడుల వేళ కేంద్రం కీలక ప్రకటన

సంకేతం

గత మూడు రోజులుగా రాత్రి సమయాల్లో ఉత్తర భారతదేశంలోని పలు సైనిక స్థావరాలు, పౌర నివాసిత ప్రాంతాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం(Central Government) ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఉగ్రవాదులు ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా అది నేరుగా భారత్‌పై చేసిన యుద్ధంగానే భావిస్తామని తేల్చి చెప్పింది. అలాంటి వారికి తగిన స్థాయిలో సైనిక చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉగ్రవాద సంస్థలకు, వాటికి మద్దతు ఇస్తున్న దేశాలకు భారత్ బలమైన సంకేతం పంపినట్లు అయింది. భారతదేశ సార్వభౌమత్వాన్ని(India sovereignty), భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉందనే సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. భారత్‌- పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొన్ని గంటల ముందే జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.

Read Also :Operation Sindoor: పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గదు :అసదుద్దీన్ ఒవైసీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870