हिन्दी | Epaper

కేజ్రీవాల్ కొత్త గేమ్, ఇరకాటంలో బీజేపీ!

Vanipushpa
కేజ్రీవాల్ కొత్త గేమ్, ఇరకాటంలో బీజేపీ!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఓట్ బ్యాంక్ పైన కేజ్రీవాల్ గురి పెట్టారు. మహిళలు, యువత, అద్దెకు ఉండే వారికి హామీలు ఇచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడు మధ్య తరగతి పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందు కీలక అంశాలను ప్రతిపాదించారు. పరోక్షంగా బీజేపీకి ఇరకాటంలోకి నెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో లోకు కౌంటర్ గా కేజ్రీవాల్ కొత్త గేమ్ ప్రారంభించారు. కేంద్రం ఫిబ్రవరి 1న ప్రతిపాదించే కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి కేటాయింపులను పది శాతానికి పెంచాలని డిమాండ్ చేసారు. అదే విధంగా ప్రయివేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ పైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఇక, ఉన్నత విద్య చదివే వారికి రాయితీలతో పాటుగా స్కాలర్ షిప్ ఇవ్వాలని డిమాండ్ చేసారు.

కేంద్రం ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పది శాతానికి పెంచాలని కోరారు. ఇక, ఆరోగ్య భీమా పై భారం తగ్గించేలా ప్రీమియం చెల్లింపుల పైన పన్ను రద్దు చేయాలని సూచించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఏడు లక్షల ఆదాయ పరిమితిని పది లక్షలకు పెంచాలని కేజ్రీవాల్ కోరారు. నిత్యవసర సరకులపై జీఎస్టీని ఎత్తివేయాలిని డిమాండ్ చేసారు. సీనియర్ సిటిజన్లకు భరోసా ఇచ్చేలా కొత్త పెన్షన్ విధానంతో పాటుగా ఆర్దిక పరంగా వెసులుబాటు కల్పించాలని కోరారు. ఇక, వీరికి దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేసారు. ఢిల్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. త్రిముఖ పోటీలో పై చేయి కోసం మూడు పార్టీలు కొత్త ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారం నిలబెట్టుకోవటం కోసం ఆప్.. ఎలాగైనా అధికారం దక్కించు కోవటం కోసం బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870