
(Jharkhand) జార్ఖండ్లోని పశ్చిమ సింగభూమ్ జిల్లాలో ఒక ఏనుగు(Elephant) బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో సుమారు 22 మందిని చంపేసింది. రోజుకు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్న ఈ ఏనుగు, గుంపు నుంచి వేరుపడి భయంకరంగా ప్రవర్తిస్తోంది. దీంతో జార్ఖండ్ ప్రభుత్వం దీంతో జార్ఖండ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.
Read Also: Loan Scam: ఇన్స్టంట్ లోన్ ప్రకటనలపై జాగ్రత్త: RBI హెచ్చరిక
ఆ జంతువును పట్టుకునేందుకు అటవీశాఖ 100 మందిని రంగంలోకి దింపింది. మూడుసార్లు ఆ ఏనుగుకు మత్తు మందు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని అదుపు చేయలేకపోయారు. బహుశా ఆ ఏనుడు మదంతో ప్రవర్తించి ఉంటుందని భావిస్తున్నారు. టెస్టెస్టరోన్ లెవల్స్ పెరగడం వల్ల ఆ ఏనుగు ప్రమాదకరంగా మారినట్లు కూడా అంచనా వేస్తున్నారు. (Jharkhand) మొదటిసారి ఓ మగ ఏనుగు ఈ స్థాయి బీభత్సం సృష్టించి ఉంటుందని ఫారెస్ట్ ఆఫీసర్ కుల్దీప్ మీనా తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: