हिन्दी | Epaper

ఇండీ కూటమిపై జమ్మూకశ్మీర్ సీఎం విమర్శలు

Sudheer
ఇండీ కూటమిపై జమ్మూకశ్మీర్ సీఎం విమర్శలు

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొంటున్న వేళ, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇండీ కూటమిపై వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో రామాయణం సీరియల్‌కు సంబంధించిన ఓ జిఫ్‌ను షేర్ చేసిన ఆయన “జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి, ఒకరినొకరు అంతం చేసుకోండి” అనే సందేశంతో కాంగ్రెస్-ఆప్ పార్టీల మధ్య ఉన్న విభేదాలను ఉద్దేశించి విమర్శించారు.

ఇండియా కూటమి స్థాపన సమయంలో బీజేపీకి బదిలీగా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఒకటై పనిచేయాలని నిర్ణయించుకున్నా, గ్రౌండ్ లెవల్‌లో ఆ సంగతులు కనిపించకపోవడం విస్మయకరంగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయడం లేదు. ఒకే కూటమిలో ఉన్నా, సీట్ల పంపిణీ విషయంలో మళ్లీ పోటీ స్థాయిలోనే వ్యవహరించాయి. ఇదే కారణంగా ప్రజలు ఆ పార్టీలు పట్ల విశ్వాసం కోల్పోయారని విశ్లేషకులు భావిస్తున్నారు.

india alliance

ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు ఇండీ కూటమిలో ఉన్న విభేదాలను మళ్లీ హైలైట్ చేశాయి. ప్రతిపక్ష కూటమిగా బీజేపీని ఎదుర్కొనాలనుకున్న పార్టీల మధ్య అసలు ఐక్యత లేదని ఆయన పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే కూడా, కూటమిలో లేని ఏకత్వం వల్లే ఓటమిని మూటగట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇండియా కూటమిలో సమన్వయం లేకుంటే వచ్చే ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్-ఆప్ వంటి ప్రధాన పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడి బీజేపీకి లాభం చేకూరేలా వ్యవహరిస్తే, ప్రధాన ప్రతిపక్ష కూటమిగా ఇండీ నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. మొత్తంగా ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీల విబేధాలను మరింత తెరమీదకు తెచ్చాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870