हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

కాంగ్రెస్ పరిస్థితి ఇక ‘జీరో’ నేనా..?

Sudheer
కాంగ్రెస్ పరిస్థితి ఇక ‘జీరో’ నేనా..?

ఢిల్లీ రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడు ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కనీస స్థాయికి పడిపోయింది. 1952 నుండి 2020 మధ్య ఎనిమిది సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగుసార్లు అధికారం చేపట్టిన ఈ పార్టీ, గత మూడు ఎన్నికల నుంచి పూర్తిగా వెనుకబడిపోయింది. 2015, 2020 ఎన్నికల్లో ఒక్క సీటూ గెలుచుకోలేక ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ’ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది.

ఈసారీ కాంగ్రెస్ మళ్లీ అదే దుస్థితిని ఎదుర్కొంటోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి కేవలం ఒకే ఒక్క స్థానం మాత్రమే స్వల్ప ఆధిక్యతతో ముందంజలో ఉంది. అయితే, ఇది కూడా పూర్తి ఫలితాలు వచ్చేనాటికి కాంగ్రెస్ చేతుల నుంచి పోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే, హ్యాట్రిక్ డకౌట్ ఖాయమనే భావన పెరుగుతోంది.

rahul delhi

ఢిల్లీ ప్రజలు ఇప్పుడు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ల మధ్యనే ఎన్నికలను పరిమితం చేసేశారు. కాంగ్రెస్ ఆగమనాన్ని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. మౌలిక సమస్యలపై ప్రజలకు దగ్గరగా ఉండటంలో విఫలమైన ఈ పార్టీ, కొత్త నాయకత్వాన్ని ఎదిగించడంలో కూడా వెనుకబడి పోయింది. ఇదే కారణంగా ఢిల్లీలో వారు పూర్తిగా మైనారిటీకీ సమానమయ్యారు.

ఒకప్పుడు షీలా దీక్షిత్ నేతృత్వంలో ఢిల్లీలో 15 ఏళ్లు వరుసగా పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు తన స్థానం కోల్పోయింది. రాష్ట్ర స్థాయిలో బలహీనతతో పాటు, జాతీయ స్థాయిలో కూడా ఈ పార్టీ ఎదుగుదలపై సీరియస్ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయ పునరుజ్జీవం లేకుంటే, ఢిల్లీలో కాంగ్రెస్ భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారనుంది.

మొత్తంగా, ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గణనీయమైన ఫలితాన్ని సాధించలేకపోతే, ఢిల్లీ నుంచి పూర్తిగా తెరమరుగయ్యే ప్రమాదం ఉంది. పార్టీకి కొత్త నేతలు, కొత్త వ్యూహాలు అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు. లేకపోతే, ఢిల్లీలో కాంగ్రెస్ తిరిగి బలపడే అవకాశాలు చాలా దూరంగా కనిపిస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870