Iran Israel War: ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం భారత్కు పలు రకాలుగా నష్టాన్ని కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ పరిణామాల వల్ల రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో పప్పు ధాన్యాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Dam height issue : ఆలమట్టి డ్యాం ఎత్తు వివాదం, కేంద్ర జోక్యం కోరిన డీకే

దిగుమతులపై ఆధారపడ్డ భారత్.. రవాణా వ్యయాల భారం
భారతీయ వంటగదిలో కీలకమైన పప్పు ధాన్యాల ధరలకు ఈ యుద్ధం కారణంగా, పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారత్ ప్రతి సంవత్సరం 5-6 మిలియన్ టన్నుల పప్పు దినుసులు (కంది, మినుము, పెసర) లను మయన్మార్, కెనడా సహా ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు మొదలైన ఇరాన్ యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రావాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో దేశీయ మార్కెట్లో సరఫరా తగ్గిపోవడం, పెరిగిన ఖర్చులతో వీటి ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆహార ద్రవ్యోల్బణానికి దారి తీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: