ఇటీవలి ఇండిగో విమానయాన(Indigo) సమస్యల నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిపై వైసీపీ(YCP) నేతలు మండిపడుతున్నారు. ఆయన నిర్లక్ష్యం, సమన్వయం లోపం కారణంగానే దేశవ్యాప్తంగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా దేశ ప్రతిష్ట దెబ్బతిన్నందున, మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read also: అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి

తమ్మినేని, రవికుమార్ ఘాటైన విమర్శలు
వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం(Indigo) మాట్లాడుతూ ముందస్తు చర్యలు తీసుకోవడంలో మంత్రి విఫలమయ్యారని, దీనివల్ల ఎన్నడూ లేని విధంగా విమాన సర్వీసులు అస్తవ్యస్తమయ్యాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడినా మంత్రి స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు. ఆముదాలవలస వైసీపీ ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. రామ్మోహన్ను “రీల్స్ మంత్రి”గా అభివర్ణిస్తూ శాఖ పనికన్నా సోషల్ మీడియా పోస్టులపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. మంత్రి, ఎంపీగా శ్రీకాకుళం జిల్లాకు ఏ ఒక్క అభివృద్ధి ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదని ప్రశ్నించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: