దేశ రాజధాని ఢిల్లీలో (Delhi Bomb Blast) చోటుచేసుకున్న కారు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన ఈ ఘటనలో భారీగా నష్టం సంభవించగా, అనేక ప్రాణాలు కూడా కోల్పోయాయి. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందిస్తూ, ఇది ఉగ్రవాదుల దాడి అని ధ్రువీకరించింది.
Read Also: Madhya Pradesh: మధ్యప్రదేశ్లో కిలో ఉల్లి ఒక్క రూపాయి
బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. క్యాబినెట్ సభ్యులు ఈ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఉగ్రవాదంపై పోరును కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేరకు ప్రకటన చేశారు. ఢిల్లీ కారు పేలుడు (Delhi Bomb Blast) ను ఖండిస్తూ.. ఉగ్రదాడిగా తీర్మానం చేసినట్టు తెలిపారు.

పిరికిపంద చర్య అమాయకుల ప్రాణాలను బలిగొంది
‘‘నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో కారు పేలుడు దేశ వ్యతిరేక శక్తులు చేసిన దారుణమైన ఉగ్రవాద ఘటనను దేశం ఎదుర్కొంది’’ అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.పేలుడు అనంతరం పరిణామాలు, దర్యాప్తు తీరుపై మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమీక్షించింది.
సమీక్ష సమావేశం ముగిసిన కొద్దిసేపటికే క్యాబినెట్ భేటీ అయ్యింది. అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘‘కేంద్ర క్యాబినెట్ ఈ దారుణమైన, పిరికిపంద చర్యను నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దానిని పూర్తిగా నిర్మూలించాలనే భారత నిబద్ధతను మళ్లీ పునరుద్ఘాటిస్తోంది’’ అని తెలిపారు.‘‘ఈ క్రూరమైన పిరికిపంద చర్య అమాయకుల ప్రాణాలను బలిగొంది.
మంత్రివర్గం దానిని తీవ్రంగా ఖండిస్తోంది. అలాగే, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పూర్తిగా అంతం చేయాలనే విధానం కొనసాగించాలన్న భారతదేశ అచంచల సంకల్పాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తోంది. దాడిని ఖండిస్తూ అనేక దేశాలు తెలిపిన సంఘీభావం, మద్దతుకు క్యాబినెట్ కృతజ్ఞతలు తెలుపుతోంది’’ అని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: