हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Helmet: నాణ్యతలేని హెల్మెట్ల తయారీ, అమ్మకాలపై కేంద్రం కఠిన చర్యలు

Anusha
Helmet: నాణ్యతలేని హెల్మెట్ల తయారీ, అమ్మకాలపై కేంద్రం కఠిన చర్యలు

దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు, వాటి వల్ల జరిగే మరణాలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల భద్రత దృష్టిలో పెట్టుకుని నాణ్యతా ప్రమాణాలు లేని హెల్మెట్ల తయారవుతున్న,అమ్ముడవుతున్న హెల్మెట్లపై ఉక్కుపాదం మోపింది. అటువంటి హెల్మెట్లను తయారుచేసే సంస్థలు, విక్రయించే రిటైలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను (State Governments) ఆదేశించింది. ఐఎస్ఐ మార్క్ ఉన్న, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికేషన్ పొందిన హెల్మెట్లను మాత్రమే వినియోగించాలని ప్రజలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. దేశంలో 21 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, రైడర్ల భద్రత అత్యంత ముఖ్యమని ప్రభుత్వం పేర్కొంది. మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని గుర్తుచేసింది. రోడ్ల పక్కన అమ్మే నాణ్యత లేని హెల్మెట్ల వల్ల ప్రమాద సమయంలో ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

హెల్మెట్లను మాత్రమే

నాణ్యమైన హెల్మెట్ల వాడకం ద్వారా తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదాలు తగ్గుతున్నప్పటికీ, ఈ విషయంలో ఇంకా చాలా చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.హెల్మెట్ల నాణ్యతను నిర్ధారించేందుకు 2021లోనే కేంద్రం ఒక క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌ (Quality Control Order) ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లను మాత్రమే విక్రయించాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 176 సంస్థలకు మాత్రమే నాణ్యమైన హెల్మెట్లు తయారు చేయడానికి బీఐఎస్ లైసెన్సులు ఉన్నాయి.నిబంధనల అమలును పర్యవేక్షించడానికి బీఐఎస్ అధికారులు నిరంతరం ఫ్యాక్టరీలు, మార్కెట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 500కు పైగా హెల్మెట్ నమూనాలను పరీక్షించగా, బీఐఎస్ మార్క్‌ను దుర్వినియోగం చేస్తున్న వారిపై 30కి పైగా సోదాలు నిర్వహించి, హెల్మెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Helmet: నాణ్యతలేని హెల్మెట్ల తయారీ, అమ్మకాలపై కేంద్రం కఠిన చర్యలు
Helmet: నాణ్యతలేని హెల్మెట్ల తయారీ, అమ్మకాలపై కేంద్రం కఠిన చర్యలు

సోదాలు నిర్వహించి

ఒక్క ఢిల్లీలోనే లైసెన్సులు రద్దయిన 9 సంస్థల నుంచి 2,500కు పైగా నాణ్యత లేని హెల్మెట్ల (Poor quality helmets) ను అధికారులు సీజ్ చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగానికి కేంద్రం ఇప్పటికే లేఖలు రాసింది.ఈ నేపథ్యంలో ప్రజల బాధ్యత మరింత పెరిగింది. తక్కువ ధర చూసి నాణ్యతా ప్రమాణాలు లేని హెల్మెట్లను కొనుగోలు చేయకూడదు. ఐఎస్ఐ గుర్తింపు పొందిన హెల్మెట్‌ (Helmet) ను తప్పనిసరిగా వాడాలి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం నిస్సందేహంగా భద్రతపరంగా శుభపరిణామం. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని గట్టిగా అమలు చేస్తే ద్విచక్ర వాహనదారుల ప్రాణాలు రక్షించబడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Saif Ali Khan: సైఫ్‌ కు చేజారిన రూ.15 వేల కోట్ల ఆస్తులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

📢 For Advertisement Booking: 98481 12870