हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

అత్యాశే కేజ్రీవాల్ కొంప ముంచిందా..?

Sudheer
అత్యాశే కేజ్రీవాల్ కొంప ముంచిందా..?

దేశ రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, తన అత్యాశతోనే రాజకీయంగా వెనుకబడిపోయారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో మూడు సార్లు ప్రజలు అధికారం అప్పగించడంతో, ఆ తర్వాత పంజాబ్‌లోనూ విజయాన్ని సాధించిన ఆప్, జాతీయ స్థాయిలో తన స్థానం బలపడించుకోవాలని ప్రయత్నించింది. అయితే, ఈ వ్యూహం కొంతవరకు విఫలమై, పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ఉద్దేశంతో ఏర్పడిన ‘ఇండియా’ కూటమికి ఆప్ తొలి నుంచి భాగస్వామి అయినా, కొంతకాలంగా దూరమవుతూ వచ్చింది. మిత్రపక్షాలతో సంబంధాలు మెరుగుపరుచుకోలేకపోవడం, స్వతంత్రంగా ఎదగాలనే ఆలోచన ఆప్‌కు పెద్ద మూల్యాన్ని చెల్లించేసింది. దీంతో, ఒంటరిగా పోటీ చేసి ఎదురులేని పోటీని తలపెట్టిన కేజ్రీవాల్, బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చి చివరికి తనకే నష్టాన్ని తెచ్చుకున్నారు.

kejriwal

దేశవ్యాప్తంగా ప్రజాదరణ పెంచుకోవాలన్న ఉద్దేశంతో కేజ్రీవాల్ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ఢిల్లీ పాలన, ఎక్సైజ్ పాలసీ కేసు, అవినీతి ఆరోపణలు లాంటి వివాదాల్లో చిక్కుకోవడంతో ఆయన తనపై వచ్చిన ఆరోపణలను మోదీ కుట్రగా చిత్రీకరించారు. అయితే, ప్రజలు ఈ వాదనను నమ్మకపోవడంతో, ఈ వ్యూహం బూమరాంగ్ అయింది. ఢిల్లీ అభివృద్ధికి సంబంధించి కేజ్రీవాల్ ప్రభుత్వం తగినంత దృష్టి సారించలేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లో ఆప్ ప్రభుత్వం గొప్ప సంస్కరణలు తీసుకువచ్చినప్పటికీ, అవినీతి ఆరోపణలు, పరిపాలనా లోపాలు ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించాయి. ఢిల్లీ ప్రజలు తమ అసంతృప్తిని ఓట్ల రూపంలో వ్యక్తం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో, ఆప్ భవిష్యత్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ పార్టీగా ఎదగాలనే లక్ష్యంతో ప్రారంభమైన ప్రయాణం, ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు కొనసాగుతుండగా, బీజేపీ వ్యతిరేక శక్తులతో సంబంధాలు బలహీనంగా మారాయి. ఈ పరిస్థితుల్లో, రాజకీయంగా తిరిగి నిలదొక్కుకోవాలంటే ఆప్‌కు సమర్థమైన వ్యూహం అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870