हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

మన్మోహన్ మృతి… వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం

Sudheer
మన్మోహన్ మృతి… వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం

భారతదేశ రాజకీయ చరిత్రలో అమూల్యమైన వ్యక్తిత్వం, సౌమ్యతకు ప్రతీకగా నిలిచిన మన్మోహన్ సింగ్ మృతి దేశాన్ని విషాదంలో ముంచింది. ఆయన భారత ఆర్థిక రంగానికి చేసిన సేవలు, 1991 ఆర్థిక సంస్కరణల అమలులో కీలక పాత్ర పోషించడం ఎంతోమందికి ప్రేరణగా నిలిచాయి. రాజకీయాలకు అతీతంగా, ప్రజల మనసుల్లో తనదైన ముద్ర వేసిన ఈ మహానీయుడు 91 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.మన్మోహన్ సింగ్ మృతి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈరోజు (డిసెంబరు 27) దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాలు రద్దు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనితో ప్రజలు ఆయన సేవలను మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ జీవిత విశేషాలు, దేశానికి ఆయన చేసిన సేవలను చర్చించి, మరింత గౌరవార్హ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంత్యక్రియలను పూర్తిస్థాయి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దిల్లీలోని రాష్ట్రీయ ఘాట్ వద్ద ఆయన అంతిమయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నేతలు, సామాన్యులు ఆయనకు నివాళులర్పించేందుకు ఢిల్లీ చేరుకుంటున్నారు. రాజకీయ విభేదాలకు అతీతంగా దేశమంతా ఆయన సేవలను ప్రశంసిస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870