हिन्दी | Epaper

Telugu news: SBI: ఎస్‌బీఐ వినియోగ దారులకు శుభవార్త.. రుణాల వడ్డీ రేట్లు తగ్గింపు

Tejaswini Y
Telugu news: SBI: ఎస్‌బీఐ వినియోగ దారులకు శుభవార్త.. రుణాల వడ్డీ రేట్లు తగ్గింపు

SBI Interest Rates: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లతో పాటు కొన్ని టర్మ్ డిపాజిట్లపై వడ్డీలను స్వల్పంగా తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి.

Read also : iPhone 15: జియోమార్ట్‌లో ఐఫోన్ 15 ప్రోపై భారీ తగ్గింపు!

SBI
Good news for SBI customers.. reduction in loan interest rates

లోన్ తీసుకున్నవారికి లాభం

ఈ మార్పులతో హోం లోన్లు, వాహన రుణాలు, MSME లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ భారం కొంత తగ్గే అవకాశం ఉంది. అన్ని కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (Marginal Cost of Funds Based Lending Rate)ను SBI 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఒక సంవత్సరం కాలపరిమితి గల MCLR 8.70 శాతంగా నిలిచింది. అలాగే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (External benchmark lending rate)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.90 శాతంగా నిర్ణయించింది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి వర్తించే బేస్ రేటును కూడా 10 శాతం నుంచి 9.90 శాతానికి తగ్గించింది.

బ్యాంకింగ్ కస్టమర్లకు రిలీఫ్

ఇక మరోవైపు రూ.3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను సవరించింది. 2 నుంచి 3 సంవత్సరాల లోపు డిపాజిట్లపై వడ్డీని 6.45 శాతం నుంచి 6.40 శాతానికి తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు ఇదే కాలపరిమితిపై వడ్డీ రేటు 6.95 శాతం నుంచి 6.90 శాతానికి తగ్గింది. అదేవిధంగా ప్రజాదరణ పొందిన ‘అమృత్ వృష్టి’ 444 రోజుల డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేటును 6.60 శాతం నుంచి 6.45 శాతానికి తగ్గించింది.

ఇదిలా ఉండగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక స్థితి బలపడటంతో 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం వాటికి కొత్తగా మూలధనం కేటాయించలేదని ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870