Gas Booking New Rules: దేశంలోని ఎల్పీజీ (LPG) వినియోగదారులకు చమురు కంపెనీలు షాకిచ్చాయి. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేస్తూ కొత్త నిబంధనను అమలులోకి తెచ్చాయి. దీని ప్రకారం, ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం కనీసం 21 రోజులు వేచి ఉండాల్సిందే.
Read Also: West Asia War: పశ్చిమాసియాలో యుద్ధం.. LPG గ్యాస్ కొరత..రైతులకు నష్టం

ఎందుకు ఈ నిర్ణయం?
పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల భవిష్యత్తులో గ్యాస్ కొరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళనతో చాలామంది వినియోగదారులు ముందస్తుగా సిలిండర్లను బుక్ (Panic Bookings) చేస్తున్నారు. దీనివల్ల సరఫరా వ్యవస్థపై అదనపు భారం పడుతోంది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకే 21 రోజుల విరామం ఉండాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి.
ఆందోళన వద్దు: అధికారులు
నిబంధనలు మార్చినప్పటికీ, దేశంలో వంట గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. కేవలం అనవసరపు బుకింగ్స్ను నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, వినియోగదారులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: