हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Fire Accident: ఢిల్లీలోని కాలేజీలో అగ్నిప్రమాదం..ప్రాణ నష్టం లేదు

Anusha
Fire Accident: ఢిల్లీలోని కాలేజీలో అగ్నిప్రమాదం..ప్రాణ నష్టం లేదు

దేశ రాజధాని ఢిల్లీలో  పీతంపుర ప్రాంతంలో ఉన్న శ్రీ గురు గోవింద్ సింగ్ (జీజీఎస్) కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో  గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది.ఈ ఘటనతో కళాశాల ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.ఢిల్లీ ఫైర్ సర్వీస్ (డీఎఫ్ఎస్) అధికారుల కథనం ప్రకారం గురువారం ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో కాలేజీలోని గ్రంథాలయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 11 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి. అగ్నిమాపక సిబ్బంది సత్వర స్పందనతో ఉదయం 9:40 గంటల సమయానికి మంటలు అదుపులోకి వచ్చినట్లు డీఎఫ్ఎస్ అధికారులు వెల్లడించారు.తొలుత కాలేజీలోని మొదటి అంతస్తులో ఉన్న గ్రంథాలయంలో మంటలు చెలరేగాయని, ఆ తర్వాత అవి వేగంగా రెండో, మూడో అంతస్తులకు కూడా వ్యాపించాయని అగ్నిమాపక శాఖ(Fire Department) అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి వెలువడిన దట్టమైన పొగలు, భారీ అగ్నికీలలు దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు.

అగ్నిప్రమాదానికి

ప్రస్తుతం ఘటనా స్థలంలో కూలింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని, మంటలు పూర్తిగా చల్లారిన తర్వాత నష్టంపై పూర్తిస్థాయి అంచనా వేయనున్నట్లు అధికారులు వివరించారు. ఉదయం ఈ ప్రమాదం జరగడం, కళాశాల పూర్తిస్థాయిలో విద్యార్థులు లేకపోవడంతో ఘటన చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు.అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. గ్రంథాలయంలోని పుస్తకాలు, ఇతర విలువైన వస్తువులకు జరిగిన నష్టంపై కూడా అంచనా వేస్తున్నారు.అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తు(Investigate) పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.

Read Also : Supreme Court: వక్ఫ్ సవరణ చట్టంపై నేడు సుప్రీంలో విచారణ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870