Finland President: ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం భారత్కు చేరుకున్నారు. దౌత్య, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సాగుతున్న ఈ పర్యటన రెండు దేశాల మధ్య కీలకంగా మారింది. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. గురువారం అలెగ్జాండర్ స్టబ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Narendra Modi) సమావేశం కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతిక రంగాలలో పరస్పర సహకారంపై చర్చించనున్నారు.
Read Also: Pentagon Deal Effect: ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!

గురువారం సాయంత్రం ఢిల్లీలో ప్రారంభం కానున్న 11వ ‘రైసినా డైలాగ్’ లో అలెగ్జాండర్ స్టబ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు, భద్రత వంటి అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు. ప్రపంచ వేదికపై భారత్ ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో ఈ ప్రసంగం ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం ఆయన ఆర్థిక రాజధాని ముంబైని సందర్శించనున్నారు. అక్కడ భారతీయ పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో సమావేశమై, ఫిన్లాండ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: