ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పాలనలో నేరాలపై పోలీసులు కఠినంగా స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 15 వేల ఎన్కౌంటర్లు జరిగినట్టు డీజీపీ రాజీవ్ కృష్ణ (DGP Rajiv Krishna)వెల్లడించారు. 2017లో యోగి సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో నేరాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.కీలక ఆపరేషన్లలో ఇప్పటివరకు 238 మంది నిందితులు మృతిచెందినట్టు వెల్లడించారు. ఇవన్నీ పోలీసులపై దాడులకు, పరారీలో ఉన్నవారిపై జరిగిన చర్యల భాగమని పేర్కొన్నారు. పోలీసులపై దాడికి ప్రయత్నించిన 9,467 మందికి కాలికి గాయాలైనట్టు వివరించారు.

30 వేల మందికి పైగా అరెస్టులు
గత ఎనిమిదేళ్లలో మొత్తం 14,973 ఆపరేషన్లు నిర్వహించి 30,694 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరాలపై కఠినంగా వ్యవహరించడమే తమ లక్ష్యమని డీజీపీ తెలిపారు. నిందితుల్ని పట్టుకోవడం కోసం నిరంతరం బలమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.మీరట్ జోన్లో అత్యధిక ఎన్కౌంటర్లు జరిగినట్టు తెలిపారు. ఆ తర్వాత ఆగ్రా, బరేలీ, వారణాసిలలో భారీగా నిందితులు అదుపులోకి వచ్చారని వివరించారు. జిల్లా వారీగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఉక్కుపాదంతో నేర నిర్మూలన లక్ష్యం
రాష్ట్రంలో భద్రతను బలోపేతం చేయడంలో పోలీసులు ముందుండి పోరాడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల రక్షణే తమ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.పోలీసుల ధైర్యవంతమైన చర్యల వల్ల రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. నేరస్థులకు బుద్ధి చెప్పేలా యోగి పాలన సాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేరాలపై చురుకైన పోలీసింగ్కి ఇదే నిదర్శనంగా నిలుస్తోంది.
Read Also : Chandrababu : ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది : చంద్రబాబు