రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా శబరిమ(Sabarimala)లకు వెళ్లారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ ఉదయం ఆమె హెలికాఫ్టర్లో పతనంతిట్ట చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పంపాకు వెళ్లారు. పంపాలో తన పాదాలను కడుక్కోవడం ద్వారా సాంప్రదాయ శుద్ధి ఆచారాన్ని పాటించారు. అనంతరం ఆమె గణపతి ఆలయంలో ఇరుముడిని సిద్ధం చేసుకుని, సన్నిధానంకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Read Also: President:తృటిలో ప్రమాదం నుంచి తప్పిచ్చుకున్న ద్రౌపదీ ముర్ము

18 పవిత్ర మెట్లు ఎక్కి అయ్యప్పకు ప్రత్యేక ప్రార్థనలు
ఆ తరువాత రాష్ట్రపతి 18 పవిత్ర మెట్లు ఎక్కి అయ్యప్పకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆమె దేవస్వం అతిథి గృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 3:10 గంటలకు సన్నిధానం నుండి బయలుదేరి సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్లో నీలక్కల్ నుండి తిరువనంతపురం వెళ్తారు. అందకుముందు ఆమె ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ స్వల్ప ప్రమాదానికి గురైంది. పతనంతిట్ట సమీపంలో ఉన్న ప్రమదం వద్ద ల్యాండింగ్ సమయంలో ఈ సంఘటన జరిగింది. ఉదయం 9.05 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కొత్తగా సిద్ధం చేసిన హెలిప్యాడ్పై సురక్షితంగా దిగింది.
ద్రౌపది ముర్ము ఏ రాష్ట్రానికి చెందినవారు?
ద్రౌపది ముర్ము 1958 జూన్ 20న ఒడిశాలోని రాయరంగ్పూర్లోని బైదపోసి ప్రాంతంలోని ఉపర్బేడ గ్రామంలో ఒక సంతాలీ కుటుంబంలో జన్మించారు.
శబరిమల ఆలయంలోకి మహిళలను ఎందుకు అనుమతించరు?
కొంతమంది హిందూ మహిళలు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నందున అయ్యప్పన్ స్వయంగా మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై ఆంక్షలు విధించారని మరియు మహిళలు ఉండటం అతనిని ఈ కారణం నుండి దూరం చేస్తుందని నమ్ముతారు. ఇతర హిందూ దేవాలయాలలో లింగ విభజన ఉందని కొంతమంది విలేకరులు ఎత్తి చూపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: