हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

పార్టీ మార్పు పై స్పందించిన డీకే శివకుమార్

sumalatha chinthakayala
పార్టీ మార్పు పై స్పందించిన డీకే శివకుమార్

కర్ణాటక: కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వార్తలను ఆయన ఖండించారు. బీజేపీ వాళ్లే తనతో టచ్ లో ఉన్నారని చెప్పి షాక్ ఇచ్చారు. కాషాయ పార్టీ నేతలే కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ముందు బీజేపీ తన ఇంటిని సరిదిద్దుకోనివ్వండి. ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

పార్టీ మార్పు పై స్పందించిన డీకే

దీనిపై ఎలాంటి చర్చలు అవసరం లేదు

ఈ విషయాన్ని మా పార్టీ మంత్రులే స్వయంగా వెల్లడించారు. దీనిపై ఎలాంటి చర్చలు అవసరం లేదు అని పేర్కొన్నారు. అయితే, ఇటీవలే ఈషా ఫౌండేషన్ ఫౌండర్ సద్గురు జగ్గీ వాసుదేవ్, కేంద్రహోంమంత్రి అమిత్ షా కలవడంపై విమర్శలు వచ్చాయి. దీనిపైనే డీకే స్పందించారు. ఆ ప్రోగ్రాం రాజకీయం కాదని, ఆధ్యాత్మికమైనందని స్పష్టం చేశారు. సద్గురు ఆహ్వానిస్తేనే ఆ కార్యక్రమానికి వెళ్లాలని చెప్పారు. ఆయన కావేరీ జలాల కోసం కూడా పోరాడుతున్నట్లు గుర్తుచేశారు.

ఇదే కాంగ్రెస్‌ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది

మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్‌ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాగా.. ఆ ప్రోగ్రాంలో అమిత్ షాతో పాటు డీకే పాల్గొన్నారు. అయితే, డీకే బీజేపీకి దగ్గరవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇదే కాంగ్రెస్‌ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది. కాగా.. బీజేపీ లీడర్, ప్రతిపక్ష నేత ఆర్ అశోకా స్పందించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో డీకే శివకుమార్‌ను పోల్చారు. అయితే, డీకే పార్టీ మారతారని వస్తున్న వార్తలను కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ఊహాగానాలపై డీకే కూడా క్లారిటీ ఇచ్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870