हिन्दी | Epaper

Delhi Covid: ఢిల్లీలో ఒక్క వారంలోనే వంద కొవిడ్ కేసులు

Sharanya
Delhi Covid: ఢిల్లీలో ఒక్క వారంలోనే వంద కొవిడ్ కేసులు

దేశ రాజధాని ఢిల్లీ(Delhi ) లో మరోసారి కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ (Covid) మహమ్మారి మళ్లీ తలెత్తడం ప్రజారోగ్య పరిరక్షణ పరంగా కీలకంగా మారింది. గత వారం రోజులలోనే ఢిల్లీలో 99 కొత్త కేసులు నమోదు కావడం, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 104కి చేరడం విశేషంగా పేర్కొనాల్సిన విషయం. ఇది దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం 1,009 యాక్టివ్ కేసుల్లో ప్రస్తుతానికి మూడవ అత్యధిక సంఖ్యగా ఉంది.

రాష్ట్రాల వారీగా కోవిడ్ పరిస్థితి:

కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ముఖ్యమైన రాష్ట్రాల్లో కేసులు ఇలా నమోదయ్యాయి. కేరళలో 430 మంది, మహారాష్ట్రలో 209 మంది, ఢిల్లీలో 104 మంది కొవిడ్ బాధితులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గుజరాత్‌లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 చొప్పున యాక్టివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇవన్నీ కలిపి చూస్తే, దేశవ్యాప్తంగా మళ్లీ కొవిడ్ ఉధృతి క్రమంగా పెరుగుతున్న సంకేతాలుగా కనిపిస్తున్నాయి.

మరణాలు:

మహమ్మారి తీవ్రత పునరుద్ధృతమవుతున్నదని సూచించేలా, ఇటీవల కొన్ని మరణాలు కూడా సంభవించాయి. మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

అయితే, కొన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు ఒక్క యాక్టివ్ కేసు కూడా నమోదు కాలేదు. అందులో అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు ప్రస్తుతానికి కోవిడ్ రహితంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్ మళ్లీ తలెత్తుతుండటంతో ప్రభుత్వం, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. గతంలో ఎదురైన అనుభవం మనకు మార్గదర్శకంగా ఉండాలి. మళ్లీ మాస్క్ ధరించాలి ,రద్దీ గల ప్రదేశాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి, హైజీన్ పాటించాలి.

Read also: Taj Mahal : తాజ్‌మహల్ వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870